ప్రియుడి బర్త్ డేకి హద్దులు చెరిపేసిన అనురాగ్‌ కశ్యప్‌ కూతురు.. బోల్డ్ ఫోటోలు.. దారుణంగా ట్రోలింగ్‌

First Published Aug 25, 2021, 9:09 AM IST

బాలీవుడ్‌ దర్శక,నిర్మాత, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ కూతురు దారుణంగా ట్రోల్స్ కి గురైంది. నెటిజన్ల విమర్శలకు బలైంది. అందుకు కారణం ఆమె తన ప్రియుడికి చెప్పిన బర్త్ డే విషెస్‌. ప్రియుడికి ఆ రేంజ్‌లో బర్త్ పుట్టిన రోజు విషెస్‌ చెప్పి ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. 

 పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబితే అందులో అంతగా ఏముందనే డౌట్‌ రావచ్చు. కానీ అనురాగ్‌ కూతురు అలియా కశ్యప్‌ తన లవర్‌కి అంత బోల్డ్ గా బర్త్ డే విషెస్‌ తెలిపింది. అంతే బోల్డ్ ఫోటోలను పంచుకుంది.

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రియుడితో క్లోజ్డ్ గా ఉన్న పిక్స్ ని పంచుకుంటూ `22వ పుట్టినరోజు శుభాకాంక్షలు నా ప్రియుడా. ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలైన అమ్మాయిగా నన్ను మార్చావు. నిన్ను కలిసినందుకు నేనెంత సంతోషంగా ఉన్నానో నాకే తెలుసు! ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా` అని పేర్కొంది అనురాగ్‌ కశ్యప్‌ కూతురు ఆలియా కశ్యప్‌. 
 

ఆమె గత కొన్ని రోజులుగా షేన్‌ గ్రెగోయిర్‌ ప్రేమలో మునిగి తేలుతుంది. హద్దులు చెరిపేసి ఆయనతో సన్నిహితంగా ఉంటోంది ఆలియా. వీరిద్దరు ఇంటెన్స్ గా ఉన్న ఫోటోలను సైతం బర్త్ డే విషెస్‌ చెబుతూ ఆలియా ఇన్ స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. ఇప్పుడివి వైరల్‌ అవుతున్నాయి. 
 

ఆలియా పంచుకున్న ప్రియుడితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలపై నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. `అసలు నువ్వు ఏం అనుకుంటున్నావు అలియా? మీ నాన్న తీసే సినిమాలు బాగానే చూస్తున్నట్టున్నావు. అందుకే ఇలా తయారయ్యావు` అని కొందరు అంటుండగా..  
 

ఆ ఫొటోలేంటి? దేనికైనా హద్దులు ఉంటాయి. అభిమానులతో అన్నీ పంచుకోవాల్సిన అవసరం ఉందంటావా? అనురాగ్‌ నువ్వేనా కాస్త చెప్పొచ్చు కదా` అంటూ దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. 

ఆలియా ఫాలోవర్లు మాత్రం.. `మీ జోడీ క్యూట్‌ ఉంది అలియా. ఎవరేమన్నా ఇలాగే ఉండండి. కలకాలం కలిసి ఉండండి` అంటూ మద్దతుగా నిలుస్తున్నారు. కాగా డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన షేన్‌తో ప్రేమలో పడిన అలియా ఈ విషయాన్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచలేదు.

గతంలో ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, `నేనే ముందడుగు వేశాను. తన కోసం ఎంతగానో పరితపించిపోయాను. రెండు నెలలు మాట్లాడుకున్న తర్వాత తొలిసారి తనను కలిశాను. తను నన్ను ఎప్పుడెప్పుడు ముద్దు పెట్టుకుంటాడా అని ఎదురుచూశా. తను మాత్రం కాస్త సందేహించాడు. అందుకే, మాట్లాడుతుండగానే నేనే ధైర్యం చేసి ముద్దుపెట్టేశాను. తను అంటే నాకు అంతగా ఇష్టం ఏర్పడిపోయింది` అని తెలిపింది. 
 

`గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసేపూర్`‌, `బాంబే వెల్వెట్`‌, `మన్‌మర్జియాన్‌` వంటి పలు విభిన్న కథా చిత్రాలను రూపొందించి తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్నారు అనురాగ్‌ కశ్యప్‌. `లస్ట్‌ స్టోరీస్`‌, `సాక్రెడ్‌ గేమ్స్‌` వంటి వెబ్‌సిరీస్‌లను తెరకెక్కించాడు.

 మొదటి భార్య ఆర్తీ బజాజ్‌ ద్వారా అతడికి కూతురు అలియా కశ్యప్‌ జన్మించింది. ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కొన్నాళ్లుగా అనురాగ్‌ ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో బాయ్‌ఫ్రెండ్‌, వివాహానికి ముందే శృంగారం వంటి పలు అంశాల గురించి ఈ తండ్రికూతుళ్లు సంభాషించిన వీడియో అప్పట్లో  సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.
 

click me!