సినిమాలు వదిలిపెట్టి.. బిజినెస్ లోకి దిగిన కమలిని ముఖర్జీ, ఏం చేస్తుందటే..?

First Published Jan 8, 2023, 9:46 AM IST

హాట్ హాట్ సినిమాలు చేయకపోవడంతో.. తొందరగా తెరమరుగయ్యింది కమిలిని ముఖర్జీ.. సినమాలు మానేసి బిజినెస్ స్టార్ట్ చేసింది.

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన తారలు చాలామంది సడెన్ గా మాయమవుతున్నారు. ఏం చేస్తున్నారు. ఎక్కడున్నారు అనేది కూడా తెలియకుండా బ్రతుకుతున్నారు. వాంటెడ్ గా కాకపోయినా.. ఆడియన్స్ పట్టించుకోకుండా ఉన్న వారు కూడా లేకపోలేదు. అందులో హీరోయిన్ కమలిని ముఖర్జీ కూడా ఒకరు. 

తెలుగు సినిమాలో అందరు హీరోయిన్లు లా కాకుండా.. కమలిని ముఖర్జీ ఇండస్ట్రీలో ఇన్నోసెంట్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్ పోజింగ్ కు దూరంగా క్లాసిక్ మూవీస్ తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీలో ఉన్నంత వరకూ ఇలాంటి సినిమాలనే చేసింది. 

నేచురల్ బ్యూటీగా పేరున్న కమలినికి హాట్ హాట్ ఆఫర్లు ఎన్ని వచ్చినా.. నో చెప్పిందట కమలిని. ఒక వేళ అప్పుడు కమలిని ఇలాంటి పాత్రకు ఎస్ అని ఉంటే.. ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేదేమో. అందుకే చాలా తొందరగా తెరమరుగయ్యింది కమలిని ముఖర్జీ.

దాదాపు  6 ఏళ్లుగా తెరపై కనిపించడంలేదు కమిలిని ముఖర్జీ. ఆమె వయస్సు ప్రస్తుంతం 42 సంవత్సరాలు.  కమలిని ముఖర్జీ పెళ్లి చేసుకున్నట్టు కూడా ఎక్కడా వార్తలు రాలేదు. మరి ఇంతకీ కమలినీ ఏం అయినట్టు.. ఏం చేస్తున్నట్టు అని కొంత మంది ఫ్యాన్స్ గూగుల్ లో వెతరకడం మొదలెట్టారు. 
 

తనకు సినిమాలు తగ్గుతున్నాయి అని  2014లోనే గమనించిన కమలిని ముఖర్జీ..  కెరియర్ ముగుస్తుంది అనుకున్న సమయంలో కమలిని తన ఇద్దరు సోదరులతో కలిసి మిర్రర్ మిర్రర్ పేరుతో  ఒక యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసింది కమిలిని. ఈ యూట్యూబ్ లో బ్యూటీ వీడియోస్ చేస్తూ.. బాగా ఫేమస్ అయిపోయింది. స్టార్ట్ చేసిన కొద్ది కాలంలోనే ఈ ఛానెల్ ఫేమస్ అయిపోయింది.

అంతే కాదు తనకు ఎంతో ఇష్టమైన  బేకరీ బిజినెస్ లోకి కూడా  అడుగుపెట్టిందట కమలిని ముఖర్జీ. బేకింగ్ అంటే కమలినికి  చాలా ఇష్టం. అందుకే వరల్డ్ ఫేమస్ కేక్ బేకింగ్ టెక్నిక్స్ నేర్చుకుని మరీ.. ఇండియాలో పరిచయం చేస్తున్నారట. ఇలా ఇండస్ట్రీకి దూరం అయిన కమలిని ముఖర్జీ... బిజినెస్ లతో ముందుకెళ్తోంది. 

అయితే బిజినెస్ లు అలా నడుస్తూనే ఉంటాయి. ఒక వేళ మరోసారి ఛాన్స్ దొరికితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతుందట కమలిని ముఖర్జీ.  2004 లో వచ్చిన ఓ ఎయిడ్స్ గురించి తెరకెక్కించిన ఫిర్ మిలేంగే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కమలిని ముఖర్జీ. ఈసినిమాను రేవతి తెరకెక్కించారు. 

ఆ తర్వాత అందమైన భామలను వెతికి మరీ తీసుకువచ్చే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ అమ్మడును చూసి ఆనంద్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు రావడంతో పాటు.. టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే  నంది అవార్డు కూడా దక్కించుకుంది బ్యూటీ. 

ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు వచ్చాయి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ,హిందీ, బెంగాలీ భాషల్లో కూడా సినిమాలు చేసింది బ్యూటీ. . ఇక తెలుగులో చివరిగా రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడే  సినిమాలో చేసింది. 

click me!