తాజాగా ఓటిటి రిలీజ్ 3 రోజెస్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. కామెడీ. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 3 రోజెస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇండిపెండెంట్ ఉమన్ ఇందు పాత్రలో పూర్ణ ఆకట్టుకున్నారు. తన పాత్ర ద్వారా ఎమోషన్స్ తోపాటు కామెడీ పండించారు. నేటి తరం యువతుల ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించేలా, పూర్ణ రోల్ తీర్చిదిద్దారు.
ఇప్పటికే పూర్ణ పలు వెబ్ సిరీస్లు, డిజిటల్ చిత్రాలలో నటించారు. ఆమె ప్రధాన పాత్రలో సుందరి చిత్రం తెరకెక్కింది. తమిళంలో పిశాచి 2లో పూర్ణ నటిస్తున్నారు. డిజిటల్ రంగం అత్యంత వేగంగా మార్కెట్ విస్తరించుకుంటూ పోతుండగా, అక్కడ వరుస ఆఫర్స్ పూర్ణ ఖాతాలో వచ్చి చేరుతున్నాయి.
కన్నమూచి అనే సిరీస్ తో పాటు నవరస తమిళ్ వెబ్ సిరీస్ లలో పూర్ణ నటించారు. నవరస ఆంథాలజీ సిరీస్ లో సూర్య, ప్రకాష్ రాజ్, రేవతి, యోగిబాబు, సిద్దార్థ్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటించిన విషయం తెలిసిందే.
మరోవైపు పాప్యులర్ డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జి గా ఆమె పిచ్చ క్రేజ్ సంపాదించారు. మరో జడ్జి ప్రియమణితో కలిసి పూర్ణ చేసే అల్లరి మామూలుగా ఉండదు. జడ్జి బాధ్యతలు నిర్వర్తిస్తూనే పూర్ణ.. తనలోని గ్లామర్, రొమాన్స్ యాంగిల్ కూడా చూపిస్తారు. కంటెస్టెంట్స్, మేల్ యాంకర్స్ తో ఆమె చేసే రొమాన్స్ షోలో హైలెట్ గా నిలుస్తూ ఉంటాయి.
వెంకటేష్ హీరోగా తెరకెక్కిన మలయాళ హిట్ మూవీ దృశ్యం 2 (Dhrushyam 2)తెలుగు రీమేక్ లో పూర్ణ కీలక రోల్ చేశారు. ఆమె లేడీ లాయర్ గా కోర్టు రూమ్ సన్నివేశాలలో దుమ్ముదులిపారు. దృశ్యం 2 నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉంది.
అలాగే బాలకృష్ణ (Balakrishna)-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం అఖండ (Akhanda) లో పూర్ణ అవకాశం దక్కించుకోవడం పెద్ద విశేషం అని చెప్పాలి. ప్రగ్యా జైస్వాల్ ప్రధాన హీరోయిన్ గా నటిస్తున్న అఖండ మూవీలో కీలక రోల్ చేశారు. డిసెంబర్ 4న విడుదలైన అఖండ హిట్ టాక్ సొంతం చేసుకుంది.