పైన ఎద అందాలు, దిగువన నడుము సోయగాలు... లంగా ఓణీలో గ్లామర్ షోకి తెరలేపిన ఇస్మార్ భామ నభా నటేష్!

First Published Aug 23, 2021, 2:08 PM IST

కన్నడ భామ నభా నటేష్ కి అవకాశాలు వస్తున్నా సరైన బ్రేక్ మాత్రం తగలడం లేదు. స్టార్ హీరోయిన్ కావాలనే ఆమె కలలకు ప్లాప్స్ అడ్డుగా నిలుస్తున్నాయి. నభా గత చిత్రాలు మూడు నిరాశ పరచగా నితిన్ మ్యాస్ట్రో పై ఆశలు పెట్టుకుంది. 
 

కన్నడ స్టార్ శివ్ రాజ్ కుమార్ హీరోగా 2015లో విడుదలైన వజ్రకాయ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది నభా నటేష్. అనంతరం మరో రెండు కన్నడ చిత్రాలలో ఆమె హీరోయిన్ ఆ నటించారు. 


టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడిగా పేరున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి సుధీర్ బాబు కోసం నాభా ను కన్నడ పరిశ్రమ నుండి దిగుమతి చేసుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో  నన్ను దోచుకుందువటే అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు. ఆ మూవీ అనుకున్నంతగా విజయం సాధించలేదు. 

అనంతరం దర్శకుడు రవిబాబు ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన అదుగో మూవీలో ఆమె నటించడం. ఓ పంది పిల్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ మూవీ వచ్చి వెళ్లినట్లు కూడా ఎవరికీ తెలియదు. 

అయితే ప్లాప్స్ లో ఉన్న పూరి ఇస్మార్ట్ శంకర్ మూవీలో తెలంగాణా పోరీ రోల్ ఆఫర్ చేశాడు. రఫ్ అండ్ మాస్ రోల్ లో నభా సహజంగా నటించి, అరిపించింది. ఆ మూవీ సూపర్ హిట్ కాగా, నభా టాలీవుడ్ లో మొదటి హిట్ అందుకుంది.

ఇస్మార్ట్ శంకర్ హిట్ నేపథ్యంలో సోలో బ్రతుకే సో బెటర్, డిస్కో రాజా చిత్రాలలో ఆమెకు ఆఫర్స్ దక్కాయి. సోలో బ్రతుకే సో బెటర్ పర్వాలేదనిపిస్తే... డిస్కో రాజా ప్లాప్ గా నిలిచింది. 2021లో అల్లుడు అదుర్స్ మూవీతో పలకరించినా ప్రయోజనం లేకుండా పోయింది. 

హిట్ తరువాత మూడు పరాజయాలు అందుకున్న నభా నటేష్ పై  నమ్మకం సడలినట్లు ఉంది. అందుకే ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. హిందీ చిత్రం అంధాదున్ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న మ్యాస్ట్రో మూవీలో నితిన్ తో జతకట్టింది. 

 
మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం నభా నటేష్ తన గ్లామర్ పవర్ చూపిస్తుంది. తాజాగా లంగా ఓణీలో ఎద అందాలు, నడుము సోయగాలు చూపిస్తూ రెచ్చగొట్టారు. నభా లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. 

click me!