బిగ్‌బాస్‌ ముందు కంటతడి పెట్టుకున్న హారిక.. సోహైల్‌ ఏం చేశాడు?

First Published Oct 21, 2020, 10:56 AM IST

బిగ్‌బాస్‌4, 44వ రోజు ఆట బాగా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. కొంటె రాక్షసులకు, మంచి మనుషుల టీమ్‌కి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ ప్రాసెస్‌లో హారికని ఏడిపించారు. 

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఏడో వారం కొనసాగుతుంది. ఈవారం ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విడగొట్టాడు బిగ్‌బాస్‌. కొంటె రాక్షసుల టీమ్‌లో అరియానా, మెహబూబ్‌, అఖిల్‌,అవినాష్‌, హారిక ఉండగా, మంచి మనుషుల టీమ్‌లో నోయల్‌, అభిజిత్‌, లాస్య, అమ్మా రాజశేఖర్‌, దివి, సోహైల్‌, మోనాల్‌ ఉన్నారు.
undefined
రాక్షసుల టీమ్‌ హౌజ్‌లో విధ్వంసం సృష్టిస్తుంటారు. అన్నింటిని పాడు చేస్తుంటారు. మంచి మనుషులు వాటిని ఓపికతో ఎదుర్కొనాలి. బిగ్‌బాస్‌ ఇచ్చే టాస్క్ లను పూర్తిచేయాలి. రెండో టాస్క్ లో హారికని మంచి మనుషుల టీమ్‌ బాగా ఇబ్బంది పెట్టింది.
undefined
ఈ టాస్క్ లో మంచి మనుషులు వంద ప్రమిదలు చేయాలి. వాటిని రాక్షసుల టీమ్ చెడగొడుతుండాలి. అవి పూర్తి చేసిన తర్వాత ఒకరిని పట్టుకుని మంచి మనిషిగా మార్చాల్సిఉంటుంది. మెహబూబ్‌ కోసం ట్రై చేయగా, ఆయన దొరకలేదు. హారిక దొరికింది.
undefined
సోహైల్‌.. హారికని పట్టుకున్నాడు. తన టీమ్‌ సహాయాన్ని ఆమె కోరుకోగా, ఎవరూ రాలేదు. దీంతో ఇద్దరు మంచి మనుషులు హారికని బిగ్గరగా నొక్కి పట్టారు. దీంతో హారికచాలా ఇబ్బంది పడింది. తాను బలవంతంగా మంచి మనిషిగా మారుతున్నానని బిగ్‌బాస్‌ ముందుకొచ్చి చెప్పింది.
undefined
తాను మంచి మనిషిగా మారడం ఎవరికీ ఇష్టం లేదని, లగ్జరీ బడ్జెట్‌లో తాను ఒక్క వస్తువుని కూడా ముట్టుకోనని చెబుతూ ఏడ్చింది.
undefined
అంతకు ముందు హారిక మంచి మనుషుల టీమ్‌ని బాగానే ఇబ్బంది పెట్టింది. అమ్మ రాజశేఖర్‌కి పసుపు సూరి, మంచు గడ్డలు వేసింది. హారికని నిలువరించే ప్రయత్నంలోసోహైల్‌, హారిక ఒకరిపై ఒకరు పడి దొర్లారు. ఇవన్నీ హారికని ఇబ్బంది పెట్టాయని చెప్పొచ్చు. అందుకే ఆమె ఏడ్చేసింది.
undefined
click me!