వసూళ్లలో దుమ్ములేపుతున్న మాస్ మహారాజా.. వంద కోట్ల క్లబ్ కి చేరువలో ‘ధమాకా’!

First Published Jan 2, 2023, 5:20 PM IST

బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా ‘ధమాకా’ దుమ్ములేపుతోంది. సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతూ సత్తా చాటుతోంది. తాజా నివేదిక ప్రకారం.. రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరుకునేందుకు అతి సమీపంలో ఉంది. 
 

టాలీవుడ్ సీనియర్ హీరో, మాస్ మహారాజా బ్యాక్ టు బ్యాక్ సినిమాలో ఫ్యాన్స్ ను, సినీ ప్రియులను అలరిస్తూనే ఉన్నారు. 2022లో వరుస చిత్రాలతో ఎంటర్ టైన్ చేసిన రవితేజ (Ravi Teja) ప్రస్తుతం ‘ధమాకా’తో దుమ్ములేపుతున్నారు. 
 

గతేడాది డిసెంబర్ 23న ప్రేక్షకుల ముుందుకు వచ్చిన ఈ మాస్ ఎంటర్ టైనర్ తొలిరోజే పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. టాక్ అదరడంతో ఇక బాక్సాఫీస్ వద్ద కూడా దూకుడు పెంచుతోంది. రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ పోతోంది. 
 

తొలిరోజే బాక్సాఫీస్ వద్ద ‘ధమాకా’తో సాలిడ్ ఓపెనింగ్స్ ను దక్కించుకుందీ చిత్రం. ఫస్ట్ డే దాదాపు రూ.10 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రెండో రోజూ వరల్డ్ వైడ్ గా రూ.19 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇక మూడో రోజు ఆదివారం వరకు రూ. 33కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ వసూళ్లు కాస్తా ఆరు రోజుల్లో రూ.56 కోట్లకు చేరుకుంది.
 

చిత్రం రిలీజై పది రోజులు కావడంతో లేటేస్డ్ అప్డేట్ అందింది. దాని ప్రకారం.. రూ.100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అతి సమీపంలో ఉన్నట్టు తెలుస్తోంది. పదిరోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.89 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని మేకర్స్ తాజాగా రిపోర్టు అందించారు. 
 

మరో పది రోజుల వరకు పెద్ద సినిమాలేవీ లేకపోవడం.. ‘ధమాకా’ క్రేజ్ కూడా పెరగండంతో మరింతగా కలెక్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. రెండ్రోజుల్లో వందకోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడం మాత్రం ఖాయమంటున్నారు. ప్రస్తుతం ఆడుతున్న చిత్రాల్లో ‘ధమాకా’నే థియేటర్లలో దుమ్ములేపుతుండటం విశేషం. 
 

రవితేజ - శ్రీలీలా జంటగా నటించిన ఈ యాక్షన్ ఫిల్మ్ కు డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. 2022 డిసెంబర్ 23న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

click me!