ఈ పిటిషన్పై సూచనల కోసం సమయం కావాలని కేంద్రం తరపు న్యాయవాది కోరారు. నెట్ ప్లిక్స్ తరపు న్యాయవాది వాదిస్తూ, ఈ చిత్రం అమ్మాయి తల్లిదండ్రుల అనుమతితో తీయబడింది. అప్పటికి ఆమెకు మైనార్టీ నిండలేదు. దాంతో తల్లితండ్రుల అనుమతి తీసుకున్నామని, ప్రాణాలతో బయటపడిన ఆమె కథను షేర్ చేసుకోవటానికి అంగీకరించబట్టే డాక్యుమెంటరీ చేసామని చెప్పుకొచ్చారు. ఇక నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, నెట్ఫ్లిక్స్, డాక్యుమెంటరీ డైరెక్టర్ నిషా పహుజాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది.