సుశాంత్ ఆత్మహత్య: గర్ల్‌ ఫ్రెండ్ రియా మీద కేసు నమోదు

First Published Jun 22, 2020, 11:19 AM IST

సుశాంత్ ఆత్మహత్యపై శనివారం బీహార్‌లో మరోకేసు నమోదైంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేందుకు ఆయన గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి కూడా ఓ కారణం అంటూ ఈ కేసు నమోదు చేశారు. ముజఫర్‌ పూర్‌లో నివాసం ఉండే కుందన్‌కుమార్‌ అనే వ్యక్తి ఈ కేసు వేశాడు.

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య వ్యవహారం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా లేదు. ఇప్పటికే సుశాంత్ మృతి ముంబై పోలీసులు అన్ని కోణాలో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు సుశాంత్‌ ది హత్య అన్న అనుమానలు కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అన్ని కోణాల్లో విచారణ జరుగుతోంది. ఇప్పటికే సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి సహా మరికొంత మందిని ముంబై పోలీసులు విచారించారు.
undefined
అయితే సుశాంత్ ఆత్మహత్యపై శనివారం బీహార్‌లో మరోకేసు నమోదైంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేందుకు ఆయన గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి కూడా ఓ కారణం అంటూ ఈ కేసు నమోదు చేశారు. ముజఫర్‌ పూర్‌లో నివాసం ఉండే కుందన్‌కుమార్‌ అనే వ్యక్తి ఈ కేసు వేశాడు. ఛీఫ్ జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ముఖేష్‌ కుమార్ ఈ కేసు విచారణను జూన్‌ 24కు వాయిదా వేశారు.
undefined
రియా చక్రవర్తి.. సుశాంత్ అవకాశాలు కోల్పోయిన తరువాత ఆయన్ను ఆర్ధికంగా, మానసికంగా ఇబ్బందులు పాలు చేసింది కుందన్ ఆరోపించాడు. కుందన్‌ తరుపు న్యాయవాది కమలేష్‌ మాట్లాడుతూ.. `నా క్లయింట్‌, సుశాంత్‌కు అభిమాని, సుశాంత్‌ ఆత్మహత్య వార్త విని ఆయన కుంగిపోయాడు. అందుకే రియా మీద ఐపీసీ సెక్షన్‌లు 306, 420ల కింద కేసు నమోదు చేశాడు` అంటూ వెల్లడించారు.
undefined
రియాను ఇప్పటికే ముంబై పోలీసులు విచారించగా పలు విషయాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా యష్‌రాజ్ ఫిలింస్‌ సంస్థతో కాంట్రక్ట్‌ను రద్దు చేసుకున్న సుశాంత్‌, తనను కూడా ఆ సంస్థతో కాంట్రక్ట్ రద్దు చేసుకోవాలని చెప్పినట్టుగా రియా ముంబై పోలీసులకు చెప్పినట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
undefined
click me!