తనను తాకబోయిన జబర్ధస్త్ కమెడియన్ కి వేదికపైనే చెప్పు చూపించిన రష్మీ!

First Published Jan 14, 2021, 4:43 PM IST

జబర్ధస్త్ వేదికపై గ్లామర్ పంచడమే కాకూండా, కంటెస్టెంట్స్ వేసే జోకులకు పగలబడి నవ్వుతూ ఉంటారు యాంకర్స్ రష్మీ గౌతమ్ మరియు అనసూయ. తరచుగా జబర్ధస్త్ కమెడియన్స్ రష్మీ, అనసూయలపై కూడా పంచ్ లు విసురుతూ ఉంటారు. 
 

కొన్నిసార్లు కమెడియన్స్ యాంకర్స్ పై వేసే పంచ్లు కొంచెం నొప్పించేవిగా ఉంటాయి. ఒక్కోసారి శృతి మించి నొప్పించే విధంగా కూడా వీరి పంచ్ ల పవర్ ఉంటుంది. ఎప్పుడైనా రష్మీ అనసూయలకు చురకలు వేయాలంటే తమ స్కిట్స్ లో ప్రత్యేకంగా కమెడియన్స్ కొన్ని డైలాగ్స్ రాసుకుంటారు.
undefined
షో కాబట్టి, వాళ్ళ పంచ్ లు మనసును నొప్పించినా వీళ్ళు మాత్రం నవ్వక తప్పదు. ముఖ్యంగా  హైపర్ ఆది, సుధీర్, రామ్ ప్రసాద్ ఈ తరహా పంచులు ట్రై చేస్తూ ఉంటారు. ఆది అయితే ఏకంగా జడ్జెస్ నే టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
undefined
తాజాగా జబర్ధస్త్ ఎపిసోడ్ లో కమెడియన్ ఇమ్మానియేల్ కి రష్మి చెప్పు చూపించింది. దానికి కారణం స్కిట్ లో ఇమ్మానియేల్ రష్మీ కలర్ పై కామెంట్ చేయడమే.
undefined
గత వారం ప్రసారమైన జబర్ధస్త్ షోలో ఇమ్మానియేల్ స్కిట్ లో భాగంగా వర్షను ప్రేమిస్తున్నట్లు, ఆమెను లైన్ లో పెట్టాలని డైలాగ్స్ చెప్పాడు. ఈ క్రమంలో వర్ష కలర్ సూపర్ అన్న అతడు, రష్మీ కలర్ మాత్రం బ్యాడ్  అన్నాడు.
undefined
ఇక స్కిట్ లో భాగంగా గుడ్డివాడిగా నటిస్తూ... రష్మిని తాకబోయిన ఇమ్మానియేల్ కి రష్మీ చెప్పు చూపించింది. దానితో ఇమ్మానియేల్ ఆమెకు దూరంగా స్టేజి మధ్యలోకి వచ్చాడు.
undefined
ఐతే ఈ విషయాన్ని రష్మీ కానీ, ఇమ్మానియేల్ కానీ సీరియస్ గా తీసుకోలేదు. ఇదంతా ప్రోగ్రాం లో భాగమే అని అందరూ సర్దుకుపోయారు.
undefined
ప్రస్తుతం రష్మీ బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీలో పెల్లెటూరి అమ్మాయిగా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
undefined
click me!