సాయం చేయకపోయినా పర్లేదు హింసించకండి... పాపం రష్మీ గౌతమ్ అంతులేని ఆవేదన!

First Published Oct 7, 2022, 10:16 AM IST

యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యారు. సహాయం చేయకపోయినా పర్లేదు కానీ హింసించవద్దని ఆమె ఒక కోట్ పోస్ట్ చేశారు. ఇంతకీ ఆమె ఆవేదనకు కారణం ఏమిటంటే... 
 

Rashmi gautam


యాంకర్ గా రష్మీ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఒకటికి మూడు బుల్లితెర షోలు ఆమె ఖాతాలో ఉన్నాయి. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లకు ఆమె యాంకర్ గా ఉన్నారు. అనసూయ వెళ్లిపోవడంతో ఆమె ఖాతాలో అదనంగా మరో షో వచ్చి చేరింది. 
 


అలాగే అడపదడపా సినిమా ఆఫర్స్ పట్టేస్తున్నారు. నటిగా యాంకర్ గా రెండు చేతులా సంపాదిస్తున్నారు. లక్షల సంపాదన, కోరుకున్న కెరీర్ సక్సెస్ అందివచ్చినప్పటికీ రష్మీని ఓ వేదన వెంటాడుతూ ఉంటుంది. అది మూగజీవాల సంరక్షణ. రష్మీ యానిమల్ లవర్. వాటికి ఏ రూపంలో హాని జరిగినా ఆమె తట్టుకోలేరు. 
 

పాల కోసం ఆవులు, గేదెలను హింసిస్తారనే కారణంతో రష్మీ గౌతమ్ వేగన్ గా మారారు. ఆమె ఎలాంటి పాల పదార్థాలు, ఉత్పత్తులు వినియోగించరు. ఇక మాంసాహారం అంటే మండిపడతారు. జీవ హింసను పూర్తిగా వ్యతిరేకించే రష్మీ ఫక్తు శాకాహారి. కేవలం చెట్ల నుండి వచ్చే పండ్లు, కూరగాయలతో చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు.

అదే సమయంలో ఎక్కడ జంతులు హింసకు గురవుతున్నాయని తెలిసినా వంటనే స్పందిస్తారు. మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తులపై చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తారు. రాత్రి వేళల్లో వీధి కుక్కలకు రష్మీ గౌతమ్ ఆహారం పెడతారు. 
 

jabardasth rashmi latest photos


కట్టిపడేసే అందమే కాదు అంతకు మించి దయా హృదయం రష్మీ సొంతం. కాగా యానిమల్ లవర్ రష్మీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. సదరు పోస్ట్ లో ''అందరికీ జంతువులకు సహాయం చేసే స్థితి ఉండకపోవచ్చు.  కానీ వాటిని హింసించకుండా ఉండే స్థితి మాత్రం ఉంటుంది'' అని ఆంటోని డగ్లస్ విలియం చెప్పిన కోట్ పోస్ట్ చేశారు. 
 

Rashmi Gautam


జంతువులను కాపాడకపోయినా, వాటికి సహాయం చేయకపోయినా పర్లేదు. కనీసం వాటిని హింసకు గురి చేయకండి. మీరు వాటిని కష్టపెట్టకపోతే అవి కాపాడబడినట్లే అని రష్మిక పరోక్షంగా తెలియజేసింది. ప్రస్తుతం రష్మీ పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె అభిప్రాయాన్ని నెటిజెన్స్ కామెంట్స్ రూపంలో తమ ఫీలింగ్స్ తెలియజేస్తున్నారు. 

click me!