నేను మాట్లాడితే వివాదం చేస్తున్నారు, దయచేసి నా ట్వీట్లు రాజకీయం చేయొద్దు: యాంకర్ అనసూయ

First Published Aug 19, 2022, 6:50 PM IST

యాంకర్ అనసూయ నెటిజన్లకు విన్నపం చేసింది. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నేను ఏం మాట్లాడినా రాజకీయం చేయోద్దంటూ వరుస ట్వీట్లు చేసింది. ఇంతకీ అనసూయ ఏ విషయంలో ఇలా మాట్లాడింది... అసలేమయ్యింది. 
 

Anasuya Bharadwaj

టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట భారీ చర్చకు దారి తీసింది. తను చెప్పే అభిప్రాయాలకు రాజకీయ రంగు పూయొద్దంటూ నెటిజన్లను వేడుకుంది అనసూయ. దయచేసిన నన్ను ఇబ్బంది పెట్టొద్దంటూ వేడుకుంది. వీటికంన్నింటికి కారణం అనసూయ పొలిటికల్ ఇష్యూపై స్పందించడమే అని తెలుస్తోంది. 

ఇక అసలు విషయం ఏంటీ అంటే..? గుజరాత్‌ బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచార కేసులో జైలు నుంచి దోషులు రీసెంట్ గా రిలీజ్ అయ్యారు.  వారికి ఓ సంస్థ సన్మానం చేసింది. ఈ విషయంపై  మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్‌ను అనసూయ రీట్వీట్ చేసింది.. దానికి టాగ్ లైన్ ఇలా రాసింది.  ఇది దారుణం  మనం స్వేచ్ఛను పునర్నిర్వచిస్తున్నట్లు అనిపిస్తోంది.. అంటే రేపిస్టులను విడిచిపెట్టి.. మహిళలను ఇంటికే పరిమితం చేసేలా ఉన్నాం.. అంటూ ఆమె రాసుకొచ్చింది. 

ఇక ఎప్పటిలాగానే అనసూయపై నెటిజన్లు తమదైన శైలిలో దాడి మొదలెట్టారు. అనసూయ ట్వీట్ కు నెటిజన్లు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో మైనర్‌పై అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని సూటిగా అడిగారు. దాంతో మరోసారి అనసూయ స్పందించింది. 

Anasuya Bharadwaj

తను చేసిన ట్వీట్లను, వ్యాఖ్యలను పాలిటిక్స్ చేయవద్దంటూ.. స్టార్ యాంకర్ వరుస ట్వీట్లు చేసింది.తాను ఏం మాట్లాడినా.. ఏ ట్వీట్ చేసినా అది తన సొంత అభిప్రాయమే అని.. దానికి ఎవరితో సంబందం లేదని.. మఖ్యంగా తను  ఎవరినీ ప్రమోట్ చేసేందుకో.. డబ్బుల కోసమో ట్వీట్స్ చేయడం లేదని తెలిపింది. 

ఇక తను చేసిన ట్వీట్స్ గురించి మాట్లాడుతూ.. అక్కడ అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకునే తాను మాట్లాడానని  చెప్పింది అనసూయ. ఒకవేళ తాను ఏదైనా మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని.. అందుకే తాను ఓ సొంత నిర్ణయానికి రాలేకపోతున్నానంటూ అనసూయ ట్వీట్ చేసింది. 

తన ట్వీట్స్‌ను రాజకీయం చేయవద్దంటూ నెటిజన్లను కోరింది అనసూయ. అయితే ఇంతటితో ఈ వివాద వాదనలు అయిపోలేదు అనసూయ ట్వీట్ లకు మరో నెటిజన్ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. అలాంటప్పుడు మీరు రాజకీయ ట్వీట్లను రీట్వీట్ చేయకపోవడమే మంచిది. ముందు మీరు ఆర్టిస్ట్  అసే సంగతి గుర్తుంచుకోండి.. అది మీరు అంగీకరించండి.. అని అన్నారు ఓ నెటిజన్.

Anasuya Bharadwaj

ఈ ట్వీట్ కు కూడా అనసూయ రిప్లై ఇచ్చింది. ఆర్టిస్ట్ గా కంటే నేను ముందు మనిషిని.. తర్వాత  మహిళను.. ఆతరువాతే ఇకేదైనా అంటూ గరం అయ్యింది. అంత పెద్ద క్రైమ్ చేసిన వారిని  విడిపించడాన్ని వ్యతిరేకిస్తూ నేను చేసిన ట్వీట్ ఎప్పుడు రాజకీయంగా మారిందో చెప్పండి అంటూ అనసూయ మరో ట్వీట్ వేసింది. 

అంతే కాదు తనకు రివర్స్ ట్వీట్ చేసిన వ్యాక్తిని ఉద్దేశించి మరో ట్వీట్ చేసింది..  మీరు రాజకీయ నాయకులా..? ఎందుకంటే దేశంలో జరుగుతున్న అఘాయిత్యాలపై.. ముఖ్యంగా మహిళలపై.. ప్రతిస్పందించడం కేవలం రాజకీయ బాధ్యతగా మీ అభిప్రాయంగా కనిపిస్తోంది.. అంటూ అనసూయ రిప్లై ఇచ్చింది. ఇక ఇలా యాంకర్ అనసూయ వరుసగా ట్వీట్స్  చేస్తుండటంతో.. నెటిజ్లు షాక్ అయ్యారు. ఏమైంది మేడం మీకు.. అంటూ పలకరిస్తున్నారు. 

Anasuya Bharadwaj

ఇక రీసెంట్ గా కామెడీ షోలలో కింగ్.. జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పింది  యాంకర్ అనసూయ  ప్రస్తుతం వరుస సినిమాలో బిజీగా ఉంటోంది. జబర్థస్త్ మత్రమే మానేసిన అనసూయ.. ఇతర కార్యక్రమాలకు యాంకర్ గా కంటీన్యూ అవుతోంది. అటు వరుసగా సినిమా ఆఫర్లు కూడా కొట్టేస్తోంది. 
 

click me!