అల్లు అర్హకి గ్రాండ్‌ వీడ్కోలు.. `శాకుంతలం` టీమ్‌కి అల్లు అర్జున్‌ థ్యాంక్స్ .. ఫోటోస్‌ వైరల్‌

First Published Aug 10, 2021, 7:42 PM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ సినీ రంగ ప్రవేశం చేస్తూ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది. తాజాగా ఆమెకి చిత్ర యూనిట్‌ గ్రాండ్‌గా వీడ్కోలు పలికింది.

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న `శాకుంతలం` చిత్రంతో బాల భరతుడి పాత్ర కోసం అల్లు అర్జున్‌ కూతురు అల్లు అర్హని ఎంపిక చేశారు దర్శకుడు గుణశేఖర్‌, గత వారం రోజులుగా అర్హ షూటింగ్‌లో పాల్గొనగా ఆమె సన్నివేశాలను చిత్రీకరించారు. 
 

`శాకుంతలం` షూటింగ్‌, `పుష్ప` షూటింగ్‌ పక్క పక్కనే జరుగుతుండటంతో బన్నీ సైతం `శాకుంతలం` సెట్‌లో సందడి చేశారు. తన భార్య స్నేహారెడ్డి, కుమారుడు అయాన్‌తో కలిసి `శాకుంతలం` సెట్‌కి విజిట్‌ చేసి సర్ప్రైజ్‌ చేశారు. అంతేకాదు కూతురు కెమెరా ముందు ఎలా యాక్ట్ చేస్తుందో చూసి ఉబ్బితబ్బిబ్బయ్యాడు బన్నీ. 

ఇక ఎట్టకేలకు అల్లు అర్హ పాత్ర షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యింది. దీంతో సోమవారం వీడ్కోలు పలికారు. గ్రాండ్‌గా డెకరేట్‌ చేసి బన్నీ సమక్షంలో కేక్‌ కట్‌ చేయించి అర్హకి వీడ్కోలు పలకడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

అల్లు అల్లు అర్జున్‌ సైతం ఆ వీడియోని పంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్‌, `శాకుంతలం` టీమ్‌కి ధన్యవాదాలు తెలిపారు. తన గారాల పట్టిని ఏ ఇబ్బంది లేకుండా బాగా చూసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పారు బన్నీ.

ఈ ఈవెంట్‌లో బన్నీ భార్య స్నేహారెడ్డి కూడా పాల్గొన్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో శాకుంత‌లగా సమంత నటిస్తుండగా, మలయాళ యంగ్ హీరో దుశ్యంతుడిగా నటిస్తున్నాడు. శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో అర్హ కనిపించనుంది. 
 

ఇదిలా ఉంటే కూతురిని చూసేందుకు `శాకుంతలం` సెట్‌లో అడుగుపెట్టిన సందర్భంగా ఓ ఫోటోని పంచుకుంటూ బన్నీ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు. `అర్హ, నేను ఒకే లొకేషన్‌లో వేరు వేరు చిత్రాల్లో నటిస్తున్నాం. ఇలాంటి రోజు ఓ 15-20 ఏళ్ల తర్వాత ఉంటుందనుకున్నా. కానీ ఇంత త్వరగా వచ్చేసింది. `పుష్ప`.. `శాకుంతలం`లోని భరతుడిని కలిశాడు. ఇది ఎప్పటికి గుర్తిండిపోతుంది` అంటూ బన్నీ ఎమోషనల్‌ అయ్యారు. 

అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ విలన్‌గా నటిస్తున్నారు.

క్రిస్మస్‌ కానుకగా సినిమా విడుదల కానుంది. మరోవైపు ఈ నెల 13న ఈ చిత్రంలోని మొదటి సాంగ్‌ `దాక్కో దాక్కో మేక.. ` విడుదల కానుంది. ఐదు భాషల్లో ఐదుగురు సింగర్స్ తో ఈ పాటని పాడిస్తున్నారు. 
 

click me!