జూలై-ఆగస్టులో ద్రవ్యోల్బణం ఊహించిన దాని కంటే తక్కువగా ఉంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బిఐ ప్రయత్నిస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో దేశ రియల్ జిడిపిలో 9.5 శాతం వృద్ధి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది.
ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటు 7.9 శాతం, మూడవ త్రైమాసికంలో 6.8 శాతం, నాల్గవ త్రైమాసికంలో 6.1 శాతంగా అంచనా వేసింది.
2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ రియల్ జిడిపి 17.1 శాతంగా ఉంటుందని శక్తికాంత దాస్ అన్నారు.
ద్రవ్యోల్బణంపై 2021-2022 ఆర్థిక సంవత్సరంలో సిపిఐ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉండవచ్చని దాస్ చెప్పారు. గత సమావేశంలో 5.7 శాతంగా అంచనా వేయబడింది.
రెండవ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 5.1 శాతం, మూడవ త్రైమాసికంలో 4.5, నాల్గవ త్రైమాసికంలో 5.8 శాతం ఉండవచ్చు.