దీని ప్రకారం ఒక వ్యక్తి కరోనా ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న తర్వాత మూడు నెలల వరకు ఎటువంటి బీమా పాలసీని పొందలేరు.
అవును.. నిజమే.. బీమా కంపెనీల కొత్త రూల్ ప్రకారం కరోనావైరస్ ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న వ్యక్తులు ఇప్పుడు కొత్త లైఫ్ ఇన్షూరెన్స్ పాలసీ కోసం 3 నెలలు వేచి ఉండాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు ఇతర వ్యాధుల లాగానే కరోనావైరస్ కేసుల కోసం వెయిటింగ్ పీరియడ్ అమలు చేస్తున్నాయి. లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీని జారీ చేసే ముందు రిస్క్ అసెస్మెంట్ చేయడానికి ప్రజలను కొంత సమయం వరకు వేచి ఉండలని కోరుతున్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న వ్యక్తులకు ఈ వెయిటింగ్ పీరియడ్ షరతు లైఫ్ ఇన్షూరెన్స్ పాలసీలదారులపై మాత్రమే వర్తిస్తుంది.