ప్రాజెక్టులకు శంకుస్థాపనలు:
వెలగపూడిలో 250 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సర్వీసు అధికారుల నివాస సముదాయాలకు నిర్మాణాలకు ప్రారంభం కానుంది. అంతేకాదు, DRDO, DPIIT, NHAI, రైల్వేలకు చెందిన రూ.57,962 కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులూ ప్రారంభమవుతాయి. అలాగే నాగాయలంకలో రూ.1,500 కోట్లతో మిసైల్ టెస్ట్ రేంజ్కు మోదీ శంకుస్థాపన చేస్తారు.