తుపాను సమయంలో 1,209 పునరావాస కేంద్రాలు 1.16 లక్షల మందికి ఆశ్రయం కల్పించాయి. మొంథా తుపాను 18 లక్షల మందిని ప్రభావితం చేసింది. ప్రభుత్వ సమీక్షలో ఇప్పటివరకు గుర్తించిన నష్టం వివరాలు గమనిస్తే..
• పంచాయతీరాజ్ రోడ్లు: 380 కి.మీ — రూ. 4.86 కోట్లు నష్టం
• ఆర్ అండ్ బీ రోడ్లు: 2,294 కి.మీ — రూ. 1,424 కోట్లు నష్టం
• రూరల్ వాటర్ సప్లయ్: రూ. 36 కోట్లు
• ఇరిగేషన్: రూ. 16.45 కోట్లు
3,175 మంది గర్భిణీలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2,130 మెడికల్ క్యాంపులు నిర్వహించారు. రహదారులపై విరిగిపడ్డ 380 చెట్లను పూర్తిగా తొలగించారు. సమీక్ష సమావేశంలో మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సీఎస్ విజయానంద్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.