బుధవారం ఉదయంనుండి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలు... ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో ఫ్లాష్ ప్లడ్స్ ప్రమాదం పొంచివుందని IMD హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వరదముప్పు పొంచివుందట... అలాగే యానాంలో కూడా సడన్ వరదలకు ఆస్కారం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, పెద్దపల్లి జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం పొంచివుందని IMD హెచ్చరిస్తోంది.
ముఖ్యంగా నదీ తీరప్రాంతాలు, వాగులు వంకలు, చెరువులు, ఇతర నీటి ప్రవాహాల సమీపంలోని లోతట్టు ప్రాంతాలకు వరదల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని IMD తెలిపింది. బ్రిడ్జిలపైనుండి నీరు ప్రవహించడం, రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది... కొన్ని ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయే పరిస్థితులు ఏర్పడవచ్చని హెచ్చరిస్తోంది. రాబోయే ఆరేడు గంటల్లో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో... రాబోయే 24 గంటల్లో తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్స్ కు అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.