కొత్తవారికి అవకాశం: తేజ, గోపిచంద్ చిత్రం ఆడిషన్స్.. డిటేల్స్!

By Surya PrakashFirst Published Jun 10, 2020, 8:46 AM IST
Highlights

టాలీవుడ్ లో ఫస్ట్ టైమ్ డైరక్టర్ తేజ ఓ సోషల్ మీడియా యాప్ ద్వారా లైవ్ ఆడిషన్స్ తీసుకోబోతున్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేసారు. తన తాజా చిత్రం అలివేలు మంగ వెంకట రమణ కు ఆడిషన్స్ ద్వారా కొత్త నటీ నటులను ఎంపిక చేయబోతున్నారు. ఈ మేరకు హలో యాప్ తో టై అప్ అయ్యారు. హీరో,హీరోయిన్స్ తప్పించి అందరూ కొత్తవాళ్లే కనపడనున్నారు.
 

తన కెరీర్ లో ఎంతో మంది నటీనటులని పరిచయం చేసిన తెలుగు దర్శకుడు తేజ.తొలి చిత్రం చిత్రం తో మొదలెట్టి తన ప్రతీ సినిమాలోనూ కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా మరోసారి అలాంటి పనే చేయబోతున్నారు. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఆయన తను డైరక్ట్ చేయబోయే సినిమాకు నటీ,నటుల ఎంపిక చేస్తున్నారు. ఇందుకోసం ఓ సోషల్ మీడియా యాప్ ని ఎంచుకున్నారు.

టాలీవుడ్ లో ఫస్ట్ టైమ్ డైరక్టర్ తేజ ఓ సోషల్ మీడియా యాప్ ద్వారా లైవ్ ఆడిషన్స్ తీసుకోబోతున్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేసారు. తన తాజా చిత్రం అలివేలు మంగ వెంకట రమణ కు ఆడిషన్స్ ద్వారా కొత్త నటీ నటులను ఎంపిక చేయబోతున్నారు. ఈ మేరకు హలో యాప్ తో టై అప్ అయ్యారు. హీరో,హీరోయిన్స్ తప్పించి అందరూ కొత్తవాళ్లే కనపడనున్నారు.

సీత సినిమాతో వెనకబడ్డ డైరెక్టర్ తేజ ఇటీవల రెండు సినిమాలను ప్రకటించారు. అందులో ఒకటి ‘అలివేలు మంగ వేంకటరమణ’ కాగా రెండోది ‘రాక్షస రాజు.. రావణాసురుడు’. ఇందులో మొదటి చిత్రమైన ‘అలివేలు వేంకటరమణ’ చిత్రం ఇప్పటికే టైటిల్ పరంగా క్రేజ్ సంతరించుకుంది. గోపీచంద్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు.  ప్రస్తుతం పెద్దగా ఆఫర్స్ లేక  ఖాళీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్‌ని హీరోయిన్ గా అనుకుంటున్నారు. 

గోపీచంద్‌తో ఆమె ఇప్పటికే ‘లౌక్యం’ అనే సినిమా చేసింది.దాంతో తేజ తన ‘అలివేలు మంగ’గా రకుల్‌ని సెలక్ట్ చేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే రకుల్‌ని సంప్రదించారని, కథ విన్నాక తన డెసిషన్ చెబుతానని రకుల్ అన్నట్లుగా  వినిపిస్తుంది.  జ సినిమాలో హీరోయిన్ పాత్రలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆమె ఓకే అంటుందని థీమాగా చెప్తున్నారు.

click me!