'లవ్ స్టోరీ' నిర్మాత, కమల్ తో స్ట్రైయిట్ తెలుగు సినిమా?

By Surya PrakashFirst Published Sep 7, 2021, 8:09 AM IST
Highlights

ఇప్పటికే సూర్య, విజయ్, ధనుష్, కార్తీ ఇలా వరసగా తమిళ హీరోలంతా కొద్ది కాలం క్రితం వరకు తమిళ డబ్బింగ్ సినిమాలతో పలకరించారు. ఇపుడు మాత్రం డైరెక్ట్ తెలుగు సినిమాలతో ఇక్కడ ఆ మార్కెట్ స్ట్రాంగ్ చేసుకునే పనిలో పడ్డారు. 
 

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలతో మంచి మార్కెట్ ని గ్రాబ్ చేస్తోంది టాలీవుడ్. దాంతో ఇక్కడ హీరోలకు ఎలా ఉన్నా ఇతర పరిశ్రమల హీరోల దృష్టి టాలీవుడ్ పై పడింది. ముఖ్యంగా తమిళ సినిమా హీరోలు తెలుగులో చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. తమిళ మార్కెట్ మన హీరోలతో రాదనుకున్నారో ఏమో కానీ అక్కడ హీరోలను తీసుకొచ్చి తెలుగు,తమిళ సినిమాలు చేస్తున్నారు మన నిర్మాతలు.

ఒకప్పటి స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్ వంటి వారు తెలుగులో మార్కెట్ సంపాదించుకుని ఇక్కడ సినిమాలు చేసారు. ఈ తరానికి చెందిన నటులు ఎవరు కూడా ఎంట్రీ ఇవ్వలేదని తెలుసు. కానీ ఇప్పటికే సూర్య, విజయ్, ధనుష్, కార్తీ ఇలా వరసగా తమిళ హీరోలంతా కొద్ది కాలం క్రితం వరకు తమిళ డబ్బింగ్ సినిమాలతో పలకరించారు. ఇపుడు మాత్రం డైరెక్ట్ తెలుగు సినిమాలతో ఇక్కడ ఆ మార్కెట్ స్ట్రాంగ్ చేసుకునే పనిలో పడ్డారు. 

 అయితే ఇటీవలే తమిళ స్టార్ హీరో ధనుష్ టాలీవుడ్ కు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అడుగు పెట్టనున్న సంగతి తెలిసిందే. విజయ్ సైతం ఇక్కడ ఓ సినిమా ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. శివ కార్తికేయన్ కూడా అదే దారిలో ప్రయాణం పెట్టుకున్నాడు. మళ్లీ కమల్ సైతం ఇక్కడ సినిమాలు చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ప్రముఖ నిర్మాతలు సునీల్ నారంగ్ తన వాళ్లతో వెళ్లి ఆయన్ను కలిసినట్లు తెలుస్తోంది. అయితే అది క్యాజువర్ మీట్ అని చెప్తున్నారు కానీ తెలుగులో ఓ స్టైయిట్ సినిమా చేయటానికి కమల్ ని ఒప్పించటానికి చెన్నైలో ఆయన్ను కలిసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ బ్యానర్ లో రెడీ అయిన శేఖర్ కమ్ముల ప్రాజెక్టు లవ్ స్టోరీ రిలీజ్ కు రెడీగా ఉంది.

లోక నాయకుడు కమల్ హాసన్ అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు2 మూవీలో నటిస్తున్నాడు. దాదాపు 22 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రం సంచలన విజయం సాధించింది. శంకర్ దర్శత్వం, కమల్ హాసన్ డ్యూయెల్ రోల్ లో నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి.

 అలాగే ఆయన ప్రస్తుతం విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా ఉండబోతోందని తెలుస్తోంది.
 

click me!