శబరిమల వివాదంపై మంచు మనోజ్ కామెంట్!

By Udayavani DhuliFirst Published Oct 31, 2018, 1:58 PM IST
Highlights

శబరిమలకి మహిళలను అనుమతించడాన్ని నిరసిస్తూ కేరళ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రుతుక్రమం జరిగే వయసున్న మహిళల కోసం అదనపు సౌకర్యాలను కల్పించేంతవరకు వారి ప్రవేశాన్ని నిరోధించాలని కోరుతూ చేసిన పిటిషన్ ని కేరళ హైకోర్టు కొట్టివేసింది. సుప్రీం కోర్టుని ఆశ్రయించాలని పిటిషనర్ కి వెల్లడించింది.

శబరిమలకి మహిళలను అనుమతించడాన్ని నిరసిస్తూ కేరళ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రుతుక్రమం జరిగే వయసున్న మహిళల కోసం అదనపు సౌకర్యాలను కల్పించేంతవరకు వారి ప్రవేశాన్ని నిరోధించాలని కోరుతూ చేసిన పిటిషన్ ని కేరళ హైకోర్టు కొట్టివేసింది. 

సుప్రీం కోర్టుని ఆశ్రయించాలని పిటిషనర్ కి వెల్లడించింది. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు స్పందించారు. మంచు మనోజ్, రామ్ చరణ్ అయ్యప్ప మాలను ధరించినప్పటికీ శబరిమల సమస్య గురించి మాత్రం స్పందించలేదు. 

దాంతో వీరిద్దరూ మాలలో ఉన్న ఫొటోని పోస్ట్ చేస్తూ  సోషల్ మీడియాలో ఓ నెటిజన్ మంచు మనోజ్, చరణ్ లను ''ఇకనైనా మీరు శబరిమల విషయంపై నోరు విప్పండి'' అని కోరాగా.. దానికి స్పందించిన మనోజ్.. ''పేదలకు తిండి, నీరు, చదువు వంటి సౌకర్యాలు అందడం లేదని మేమంతా చింతిస్తున్నాం.

మనం ముందు వారి గురించి ఆలోచించాలి. మనందరికీ దేవుడిపై నమ్మకం ఉంది కదా.. అలాంటప్పుడు ఆయనకి వచ్చిన సమస్యను ఆయనే పరిష్కరించుకుంటాడు. మనమంతా మానవత్వం వైపు నిలబడతాం'' అని వెల్లడించారు. 

శబరిమల వివాదంపై మొదటిసారి స్పందించిన రజినీకాంత్!

శబరిమల ప్రవేశం: మహిళల పట్ల వివక్ష అనడం దురదృష్టకరం..ప్రమాదం

అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే వెను దిరిగిన మహిళలు, ఎందుకంటే?

శబరిమల వద్ద ఇంకా ఉద్రిక్తత: గుడికి 200 మీటర్ల దూరంలో మహిళలు

శబరిమల దాకా వెళ్లి వెనక్కి మళ్లిన ఏపీ మహిళ

శబరిమల తీర్పుకి మద్దతు పలికిన స్వామీజీ... ఆశ్రమానికి నిప్పు

శబరిమల ఆలయంలోకి వెళ్లినందుకు...వేటు వేసిన బీఎస్ఎన్ఎల్

శబరిమలలో మహిళల ప్రవేశం.. రివ్యూ పిటిషన్‌పై విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

శబరిమల వ్యవహారాన్ని టాయ్ లెట్ తో పోల్చిన కమల్ హాసన్ సోదరుడు

శబరిమల.. ఐదుగురు తెలంగాణ మహిళలను అడ్డుకున్న ఆందోళనకారులు

click me!