Drugs Case : డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ కి నిర్వహించే పరీక్షలు ఇవే.. డీసీపీ వ్యాఖ్యలు

By tirumala ANFirst Published Feb 28, 2024, 8:55 AM IST
Highlights

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ అనుమానితుడిగా ఎఫ్ఐఆర్ లో చేర్చబడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ అనుమానితుడిగా ఎఫ్ఐఆర్ లో చేర్చబడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్శకుడు క్రిష్ విచారణ ఎదుర్కొనక తప్పదు అన్నట్లుగా డీసీపీ వినీత్ కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. 

రాడిసన్ హోటల్ లో పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఒక మోడల్, టాలీవుడ్ నిర్మాత పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే డ్రగ్స్ సరాఫరా చేసిన అబ్బాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పార్టీ జరుగుతున్న సమయంలో హోటల్ లో డైరెక్టర్ క్రిష్ అరగంట పాటు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హోటల్ యజమాని వివేకానందతో ఆయన మాట్లాడారు. 

అందుకే అనుమానంతో పోలీసులు క్రిష్ పేరుని చేర్చినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ క్రిష్ కి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని డిసిపి అన్నారు. తద్వారా అనుమానం తీరుతుందని తెలిపారు. రక్త, మూత్ర పరీక్షలు చేసి విచారించబోతున్నట్లు తెలిపారు. 

ఈ కేసు సంచలనంగా మారుతుండడంతో క్రిష్ స్పందించారు.  తాను రాడిసన్ హోటల్ కి వెళ్లిన మాట వాస్తవమే అని అంగీకరించారు. తన స్నేహితులని కలిసేందుకు అక్కడికి వెళ్లినట్లు క్రిష్ పేర్కొన్నారు. తన డ్రైవర్ రావడం ఆలస్యం కావడంతో హోటల్ యజమాని వివేకానందతో కాసేపు మాట్లాడానని.. డ్రైవర్ రాగానే అక్కడికి నుంచి వెళ్లిపోయినట్లు క్రిష్ పేర్కొన్నారు. అంతే కానీ డ్రగ్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని క్రిష్ తేల్చి చెప్పారు. 

click me!