Jan 8, 2019, 12:37 PM IST
'పేటా' చిత్రానికి థియేటర్లు దొరక్కుండా చేస్తున్నారని, మంచి చిత్రాలను వదిలేసి తమకు నచ్చిన సినిమాలను థియేటర్లలో ఆడిస్తున్నారని కామెంట్స్ చేశారు అశోక్ వల్లభనేని. దీంతో అల్లు కాంపౌండ్ వ్యక్తి నిర్మాత బన్నీ వాసు.. అశోక్ పై ఫైర్ అయ్యారు. పరోక్షంగా ఆయనకి వార్నింగ్ ఇచ్చాడు.
ఇప్పుడు దిల్ రాజు కూడా ఈ విషయంపై స్పందించారు. సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు విడుదలవుతున్న నేపధ్యంలో డబ్బింగ్ సినిమాకి థియేటర్లు ఎలా దొరుకుతాయని ఆయన ప్రశ్నించారు. మూడు సినిమాలకే థియేటర్లు సరిపోని పరిస్థితి నెలకొందని అన్నారు.