సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్ ఐదె రెగ్యులేటరీ గేట్ నుంచి నీటి లీకేజీ వ్యవహరంలో అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కాంక్రీట్ లోపమే కొంపముంచిందని మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన సమీక్షలో తేలింది.
సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్ ఐదె రెగ్యులేటరీ గేట్ నుంచి నీటి లీకేజీ వ్యవహరంలో అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కాంక్రీట్ లోపమే కొంపముంచిందని మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన సమీక్షలో తేలింది.
దీనికి తోడు స్టాఫ్ లాగ్ గేట్ల అంశం అధికారులు గోప్యంగా ఉంచినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఐదు స్టాఫ్ లాగ్ గేట్లను చిత్తూరు జిల్లాలోని కళ్యాణి డ్యామ్కు వినియోగించగా.. మిగిలిన దానిని సూర్యాపేట జిల్లాలోని మూసీ రిజర్వాయర్ వద్దకు తరలించారు.
దీంతో యుద్ధప్రాతిపదికన మరో ఎనిమిది గేట్ల తయారీకి రంగం సిద్ధం చేస్తున్నారు. వాటిని సైతం రెండు రోజుల్లో మార్చాలని జగదీశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరోవైపు రిజర్వాయర్లో నీటిమట్టం 625 అడుగులకు చేరింది. ప్రస్తుతం ఇన్ఫ్లో 1200 కాగా.. అవుట్ ఫ్లో 8000గా ఉంది.