ఐపీఎల్ పార్టీల్లో డ్రగ్స్... బోల్డ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు...

By team teluguFirst Published Sep 26, 2020, 3:13 PM IST
Highlights

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ టీమ్ పార్టీలో కొకైన్ వాడడం చూశానని చెప్పిన షెర్లిన్...

క్రికెటర్ల భార్యలు డ్రగ్స్ మత్తులో తూగడం చూసి షాక్ అయ్యానన్న బోల్డ్ హీరోయిన్...

సినీ రంగం నుంచి క్రీడా రంగానికి ‘మత్తు’ వివాదం...

బాలీవుడ్‌ను డ్రగ్స్ మాఫియా కుదిపేస్తోంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత అక్కడ పరిస్థితులన్నీ మారిపోయాయి. తాజాగా సినిమా రంగం నుంచి క్రీడా రంగానికి డ్రగ్ లింక్ అంటించింది హీరోయిన్ షెర్లిన్ చోప్రా.

‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన షెర్లిన్ చోప్రా, ఆ తర్వాత కొన్ని హిందీ సినిమాల్లో నటించింది. ‘కామసూత్ర 3డీ’ సినిమా కోసం నగ్నంగా నటించిన షెర్లిన్ చోప్రా, ప్రస్తుతం తన పర్సనల్ యాప్ కోసం బూతు వేషాలన్నీ వేస్తోంది. తాజాగా ఐపీఎల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది షెర్లిన్.

‘నేను ఓ ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వెళ్లాను. మ్యాచ్ తర్వాత కోల్‌కత్తా నైట్‌రైడర్స్ టీమ్ పార్టీలో డ్యాన్స్ చేయడానికి వెళ్లాను. డ్యాన్స్ చేసి అలసిపోయిన తర్వాత వాష్‌రూమ్‌కి వెళ్లాను. అక్కడ క్రికెటర్ల భార్యలు కొకైన్ తీసుకుంటూ కనిపించారు. షాక్ అయ్యాను. బయటికి వచ్చి, పురుషుల వాష్ రూమ్‌కి వెళ్లా. అక్కడ కూడా అదే సీన్’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది షెర్లిన్ చోప్రా.

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టుకి బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, హీరోయిన్ జూహ్లీ చావ్లా యజమానులైన సంగతి తెలిసిందే. మరి షెర్లిన్ చేసిన వ్యాఖ్యలు క్రీడారంగంపై ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి.

click me!