పైకి చూస్తే స్పా సెంటర్ బోర్డు.. లోపల నడిచేది వ్యభిచారం.. గుట్టురట్టు చేసిన పోలీసులు..

By Asianet NewsFirst Published Aug 17, 2023, 1:30 PM IST
Highlights

స్పా సెంటర్ బోర్డు పెట్టి లోపల వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళను, ఆమె భర్తను భవానీపురం పోలీసులు అరెస్టు చేశారు. అక్కడున్న యువతులను కౌన్సెలింగ్ కోసం తీసుకెళ్లారు.

అదో స్పా సెంటర్. కానీ లోపల నడిచేది వ్యభిచారం. ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో రైడ్ నిర్వహించారు. అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను, అదుపులోకి తీసుకున్నారు. అలాగే అక్కడున్న యువతులను కౌన్సెలింగ్ కోసం తరలించారు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. 

ఇస్లాం కంటే హిందూ మతం చాలా పురాతనమైంది.. భారత ముస్లింలు మొదట హిందువులే - గులాం నబీ ఆజాద్

వివరాలు ఇలా ఉన్నాయి. భవానీపురం బైపాస్ రోడ్డులోని ఓ బిల్డింగ్ లో స్పా సెంటర్ ఉంది. దానిని సీటికి చెందిన ఓ మహిళ నిర్వహిస్తోంది. అయితే పైకి స్పా సెంటర్ అని బోర్డు పెట్టి లోపల మాత్రం పలువురు యువతులతో ఆమె వ్యభిచారం చేయిస్తోంది. ఇదంతా గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. 

తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత.. 50 రోజుల వ్యవధిలో మూడోది..

అయితే స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నడుస్తోందని భవానీపురం పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు ఆ స్పా సెంటర్ పై దాడి చేశారు. ఆ సమయంలో అక్కడ 11 మంది యువతులు ఉన్నారు. అలాగే ముగ్గురు విటులు కూడా అక్కడ ఉన్నారు. స్పా సెంటర్ నిర్వహిస్తున్న శ్రీ విద్య, ఆమె భర్త సత్యనారాయణలను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్ కు తరలించారు. కాగా.. 11 మంది యువతులను కౌన్సెలింగ్ కోసం హోంకు తీసుకెళ్లారు.

click me!