మిత్రుడికి నివాళి.. శివప్రసాద్‌కు నివాళులర్పిస్తానని అనుకోలేదు: బాబు

By Siva KodatiFirst Published Sep 22, 2019, 4:00 PM IST
Highlights

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఆదివారం తిరుపతిలోని శివప్రసాద్ నివాసానికి వెళ్లిన బాబు.. ఆయన పార్ధీవదేహంపై పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఆదివారం తిరుపతిలోని శివప్రసాద్ నివాసానికి వెళ్లిన బాబు.. ఆయన పార్ధీవదేహంపై పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివప్రసాద్‌కు నివాళులర్పిస్తానని ఊహించలేదన్నారు. ఇద్దరం మంచి మిత్రులమని, డాక్టర్‌గా ఉండి కళపై మమకారం పెంచుకున్నారని, తనపై నమ్మకంతోనే రాజకీయాల్లోకి వచ్చారని బాబు గుర్తుచేసుకున్నారు.

శివప్రసాద్ రాష్ట్రం కోసం ఎనలేని పోరాటం చేశారని, ప్రజా సమస్యలను తన కళారూపంలో తెలియజేశారని.. ఆయన ఆజాత శత్రువని పేర్కొన్నారు. ఆయన కమెడియన్, నేను హీరోగా నాటకం వేశామని చంద్రబాబు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

మరికొద్దిసేపట్లో శివప్రసాద్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం అరగాలలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. 

అధికారిక లాంఛనాలతో శివప్రసాద్ అంత్యక్రియలు

సాయంత్రం 5 గంటలకు శివప్రసాద్ అంత్యక్రియలు: పాల్గొననున్న చంద్రబాబు

వైఎస్ రాజారెడ్డితో శివప్రసాద్‌కు సంబంధాలు: వైఎస్ఆర్ బంపర్ ఆఫర్

మాజీ ఎంపీ శివప్రసాద్ మరణం కలచివేసింది : పవన్ కళ్యాణ్

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కుటుంబ నేపథ్యమిదీ

ఒకే స్కూల్లో చదివిన శివప్రసాద్, బాబు: ప్రతి రోజూ కాలినడకే

మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి: సీఎం జగన్ సంతాపం

ప్రత్యేక హోదా ఉద్యమం: శివప్రసాద్ వేసిన విచిత్ర వేషాలు ఇవే
వారంలో ఇద్దరు నేతలను కోల్పోయాం: చంద్రబాబు ఆవేదన

హోదా ఉద్యమంలో శివప్రసాద్ స్పెషల్ రోల్: దేశం దృష్టిని ఆకర్షించిన మాజీ ఎంపీ

చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

శివప్రసాద్ సినీ కెరీర్.. చెరగని ముద్ర!

 

click me!