జగన్ పై దాడి.. తనకేం భయంలేదన్న టీడీపీ ఎమ్మెల్యే

By ramya neerukondaFirst Published Nov 22, 2018, 11:01 AM IST
Highlights

జగన్ పై జరిగిన దాడికి.. తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై గతనెలలో విశాఖ ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి  కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా.. జగన్ పై జరిగిన దాడికి.. తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.

ఈ నెల 23న మంత్రి లోకేష్... గురజాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో  యరపతినేని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ పై దాడికి.. తనకు, సీఎం చంద్రబాబుకి, మంత్రి ఆదినారాయణ రెడ్డిలకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

వైసీపీ నేతలు కేసులు పెట్టినంత మాత్రాన తాము భయపడమన్నారు. తాటాకు చప్పుళ్లకు, ఉడుత ఊపులకు భయపడే రకం కాదన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.  ఇప్పటికే వైసీపీ నేతలు కోడికత్తితో పరువు పొగొట్టుకున్నారని, మిగిలిన పరువునైనా కాపాడుకోవాలని హితవు పలికారు.

దాడి కేసులో వాంగ్మూలంపై దిగొచ్చిన జగన్

దాడి: జగన్‌‌కు నోటీసులు జారీ చేసిన సిట్

జగన్ చొక్కా ఇస్తేనే.. రహస్యం బయటపడుతుంది: దేవినేని

జగన్‌పై దాడి: పర్మిట్ లేని శ్రీనివాస్ అక్కడికి ఎలా వెళ్లాడు

జగన్‌పై దాడి: సీసీకెమెరాల వైఫల్యంపై హైకోర్టు ఆగ్రహం

జగన్‌పై దాడి: విజయమ్మ అనుమానాలివే

చేయించి మా అమ్మపైకి నెడుతారా: దాడిపై జగన్ భావోద్వేగం

మార్చిలో నా హత్యకు బాబు ప్లాన్, అందుకే శివాజీతో అలా: జగన్

పోలవరంలో అవినీతి, అగ్రిగోల్డ్ ఆస్తులు అన్యాక్రాంతం: బాబుపై జగన్ ఫైర్

జగన్ తో నడవని వైఎస్ ఆత్మ ఏమంటోంది....

జగన్ పై పవన్ ‘మగతనం’ కామెంట్స్

జగన్‌పై దాడి కేసు: చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

click me!