కన్నకూతురిపై రెండోసారి తండ్రి అత్యాచారం.. మద్యం మత్తులో కామం తలకెక్కి...

By SumaBala BukkaFirst Published Jan 6, 2022, 9:45 AM IST
Highlights

 తెల్లవారుజామున తండ్రి కూతురి మీద అత్యాచారానికి పాల్పడగా.. పెద్దగా కేకలు వేయడంతో నిద్రపోతున్న తల్లి లేచింది.  అక్కడి దృశ్యం చూసి పెద్దగా అరవడంతో భర్త పారిపోయాడు. మనస్థాపంతో బాలిక తల్లి ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతుండగా పెద్దకొడుకు అడ్డుకున్నాడు.  

తాడేపల్లి :  కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి liquor మత్తులో minor అయిన కన్న కూతురిపై రెండోసారి rapeకి పాల్పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది.  పోలీసుల కథనం ప్రకారం uttarpradesh నుంచి 12 ఏళ్ళక్రితం ఓ కుటుంబం తాడేపల్లికి వలస వచ్చి మహానాడు లోని ఓ కాలనీ లో ఉంటుంది. భర్త సీలింగ్ పనులు చేస్తుండగా... భార్య పిల్లలను చూసుకుంటూ ఇంటివద్దే ఉంటుంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు.

రెండో కుమార్తె వయసు పదకొండేళ్లు,  దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది.  తెల్లవారుజామున తండ్రి కూతురి మీద అత్యాచారానికి పాల్పడగా…  పెద్దగా కేకలు వేయడంతో నిద్రపోతున్న తల్లి లేచింది.  అక్కడి దృశ్యం చూసి పెద్దగా అరవడంతో భర్త పారిపోయాడు. మనస్థాపంతో బాలిక తల్లి ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతుండగా పెద్దకొడుకు అడ్డుకున్నాడు.  

ఆ తర్వాత స్థానికుల సలహాతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే భర్త ఇలా అఘాయిత్యానికి తెగడబడడం ఇది మొదటి సారి కాదని..  ఏడాది క్రితం తన భర్త కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడని  బయటికి చెబితే అందరిని చంపుతానని బెదిరించాడని ఆమె వాపోయింది. చేసిన తప్పు బంధువులకు తెలిసి నిలదీయడంతో క్షమాపణ కోరు తప్పించుకున్నాడని.. రెండోసారి మళ్లీ తప్పు చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.  బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇలాంటి దారుణ ఘటనే రాజస్థాన్ లో రెండు రోజుల క్రితం చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు అత్యంత పాశవికంగా వ్యవహరించారు. సభ్యసమాజం తలదించుకునే కీచకపర్వానికి తెరతీశారు. 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారయత్నం చేసి, హత మార్చడమే కాకుండా.. అనంతరం బాలిక మృతదేహంపై కూడా అత్యాచారం కొనసాగించిన దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బుండీ పట్టణంలో వెలుగుచూసింది.

గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన తప్పిపోయిన పదహారేళ్ల బాలిక మృతదేహమై కనిపించింది. పదహారేళ్ల బాలిక శవ పరీక్ష నివేదికలో దుండగులు అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. అంతేకాదు పోస్టుమార్టం చేసిన వైద్యులు ఓ భయంకర నిజాన్ని తెలుసుకుని షాక్ కు గురయ్యారు. ఆమె మీద అత్యాచార యత్నం చేసి, చంపేయడమే కాకుండా ఆమె మరణించిన తర్వాత కూడా బాలిక మృతదేహంపై నిందితులు అత్యాచారం కొనసాగించారని పోస్టుమార్టంలో తేలింది. 

ఏలూరులో దారుణం: భర్త సోదరుడితో వివాహేతర సంబంధం... ప్రియుడితో కలిసి మహిళ ఆత్మహత్య (Video)

వివరాల్లోకి వెడితే.. బుండి పట్టణ శివార్లలోని పొలాల్లో ఓ పదహారేళ్ళ వయసు గల బాలిక మేకలను మేపేందుకు వెళ్లింది. ఆ తరువాత అదృశ్యమైంది. ఆ బాలికను అపహరించిన ముగ్గురు కామాంధులు.. గిరిజన బాలికపై సామూహిక అత్యాచార యత్నం చేయగా, ఆమె ప్రతిఘటించడంతో వారు ఆమె గొంతు నులిమి చంపేశారు. ఆ తరువాత అంతటితో ఆగకుండా ఆమె శవం మీద కూడా అత్యాచారానికి తెగబడ్డారు. 

శవ పరీక్షలో బాలిక ప్రైవేటు భాగాల్లో 30కి పైగా గాయాలయ్యాయని తేలింది. నిందితులు ఆమె శరీరంపై గీతలు వేశారు. బాలికపై అత్యాచారం చేయడానికి ముందు నిందితులు ఆమెను దుపట్టాతో కట్టేసినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ‘నా జీవితంలో ఇంత దారుణమైన సంఘటన చూడలేదు. బుండీ బార్ అసోసియేషన్ సభ్యులు కూడా తాము నిందితుల తరపున  కోర్టులో వాదించబోమని ప్రకటించారు’ అని బుండి జిల్లా ఎస్పీ జై యాదవ్ చెప్పారు. 

click me!