టీడీపీ నేత కూన రవికుమార్‌కు ఊరట: ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు

By Siva KodatiFirst Published Sep 24, 2019, 2:48 PM IST
Highlights

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ఊరట లభించింది. అధికారులను దూషించిన కేసులో ఆయనకు హైకోర్టులో ముందస్తు బెయిల్ లభించింది.

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ఊరట లభించింది. అధికారులను దూషించిన కేసులో ఆయనకు హైకోర్టులో ముందస్తు బెయిల్ లభించింది. తనను మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమారర్ దూషించారంటూ బుజ్జిలి ఎంపీడీవోదామోదరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో కూన రవికుమార్ తోపాటు 11 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు...10 మందిని అరెస్ట్ చేసి ఆముదాలవలస కోర్టులో హాజరుపరిచారు. వారందరికి జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.జ్యోత్స్న సెప్టెంబర్ 11 వరకు రిమాండ్ విధించారు. 

మరోవైపు కూన రవికుమార్ అరెస్ట్ పై శ్రీకాకుళం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు కూనను అరెస్ట్ చేసేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు.

గాలింపు చర్యలు చేపడుతున్నారు. కూన రవికుమార్ బంధువుల గురించి ఆరా తీస్తున్నారు.  తన అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న కూన రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అరెస్ట్ కు రంగం సిద్దం

టీడీపీ నేతలకు కేసుల ఉచ్చు: కోడెలతో మొదలు పెట్టి...

సీబీఐ విచారణకు హైకోర్టు ఆర్డర్: అజ్ఞాతంలోకి యరపతినేని

ఫోర్జరీ సంతకాలు.. భూమి విక్రయం: మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు నమోదు

అజ్ఞాతంలోకి టీడీపీ నేత కూన రవికుమార్: పోలీసుల గాలింపు

కోడెల షోరూంలో తనిఖీలు: అసెంబ్లీ ఫర్నీచర్ రికవరీ

అసెంబ్లీ ఫర్నీచర్ దారి మళ్లింపు: కోడెలపై మరో కేసు

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ

click me!