మండలి రద్దుకు జగన్ కసరత్తు: అసెంబ్లీలో తీర్మానం?

Published : Jan 21, 2020, 02:23 PM ISTUpdated : Jan 21, 2020, 03:59 PM IST
మండలి రద్దుకు జగన్ కసరత్తు: అసెంబ్లీలో తీర్మానం?

సారాంశం

ఏపీ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే ప్రచారం సాగుతోంది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేసే చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు తీర్మానాన్ని సిద్దం చేసిందని సమాచారం. 

శాసనమండలిలో ఇవాళ చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో  తీర్మానాన్ని  ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని  సర్కార్ భావిస్తోంది. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే  శాసనమండలిని రద్దు చేయడం అంత సులభం కాదని పవన్  టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు చెప్పారు.

also read: ఢిల్లీకి పవన్ కళ్యాణ్: బీజేపీ, జనసేన నేతల కీలక భేటీ

శాసనమండలిలో  టీడీపీకి 29 మంది సభ్యులు ఉన్నారు. వైసీపీకి 9 మంది సభ్యులు ఉన్నారు. పీడీఎప్ కు  ఆరుగురు సభ్యులు, బీజేపీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మంగళవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. 

Also read:అందుకే టీడీపీ ఒక్క స్థానంలోనే గెలిచింది: అసెంబ్లీలో జగన్

Also read:జగన్‌కు షాక్: మండలిలో టీడీపీ నోటీసుపై చర్చకు అనుమతి

Also read:బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ

Also read:ఏపీ అసెంబ్లీలో టీడీపీ నిరసన: హెడ్‌సెట్ తీసేసి కోపంగా వెళ్లిన స్పీకర్ తమ్మినేని

టీడీపీకి శాసనమండలిలో మెజారిటీ ఉంది.  ఇవాళ శాసనమండలిలో   పాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టారు అయితే ఈ బిల్లు కంటే ముందే టీడీపీ సభ్యులు 71 రూల్ కింద నోటీసు ఇచ్చారు. 

ఈ నోటీసుపై చర్చకు శాసనమండలి ఛైర్మెన్  ఎంఏ షరీఫ్ అనుమతి ఇచ్చారు. పాలనా వీకేంద్రీకరణ బిల్లుపై చర్చను అనుమతి ఇవ్వాలని  ప్రభుత్వం కోరింది.  ఈ విషయమై మంత్రి బొత్స సత్యనారాయణ  మండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండలి ఛైర్మెన్ స్పందించారు.

also read:మండలిలో బిల్లు: 71 కింద చర్చకు పట్టు, టీడీపీ సభ్యుల గైర్జాజర్

Also read:ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లు: కౌంటర్ వ్యూహాంతో టీడీపీ

మండలిని రద్దు చేసే తీర్మానాన్ని ఏపీ సర్కార్ రెడీ చేసింది.  ఈ తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీలో  వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టాలని భావిస్తోంది.ఈ విషయమై మంత్రివర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసి  శాసనమండలిని రద్దు విషయమై కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ విషయమై వైసీపీ నాయకత్వం చర్చిస్తుంది. 

ఇదిలా ఉంటే  శాసనమండలిని రద్దు చేయడం అంత సులభం కాదని  టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు  చెప్పారు. శాసనమండలిని రద్దు చేసే విషయమై  ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం