త్వరలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రాకు అరుదైన అవకాశం లభించింది. ఒలింపిక్ జ్యోతిని ఆయన మోయనున్నారు. ఒలింపిక్స్ క్రీడల్లో వ్యక్తిగత ఈవెంట్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా ఘనత వహించిన ఈయన తన సోషల్ మీడియా పోస్ట్లో ఈ వార్తను అధికారికంగా ప్రకటించాడు.