తమిళనాడులోని కున్నూరులో బుధవారం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద ఘటన పార్థివ దేహాలను తరలిస్తున్న అంబులెన్సుకు ప్రమాదం జరిగింది. కోయంబత్తూరు వద్ద ఈ అంబులెన్సు ముందు వెళుతున్న మరో అంబులెన్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ప్రమాదానికి గురైన అంబులెన్సులోని పార్థివ దేహాలను మరో అంబులెన్సులోకి ఎక్కించారు.