రిపబ్లిక్ టీవీ-జన్కీ బాత్ నిర్వహించిన సర్వేలో మహారాష్ట్రలో శివసేన-బీజేపీ కూటమికి మరోసారి అధికారం దక్కే అవకాశం ఉందని వెల్లడించింది. సర్వే ప్రకారం బీజేపీ కూటమి 135 నుంచి 142 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. బీజేపీకి 33, కాంగ్రెస్కి 11, శివసేనకు 24, ఎన్సీపీకి 15, ఇతరులు 16 శాతం ఓట్లు దక్కనున్నాయని సర్వే తెలిపింది.