సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దర్శకుడి భార్య శ్యామలీ పోస్ట్ లు దుమారం రేపుతున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. తరచూ వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో ఈ రూమర్లకి మరింత బలం చేకూరుతుంది.
అంతేకాదు ఈ ఇద్దరు పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సమంత, రాజ్ నిడిమోరు ప్రేమ వ్యవహారంపై దర్శకుడి మాజీ భార్య శ్యామలీ తరచూ స్పందిస్తుంది.
సమంత, రాజ్నిడిమోరుపై శ్యామలీ పోస్ట్
ఆమె డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా పోస్ట్ లు పెడుతుంది. ఎవరిని ఉద్దేశించి ఆమె పోస్ట్ లు పెడుతుందో స్పష్టత లేదు. కానీ తన భర్త, సమంతతో ప్రేమలో ఉన్నారనే రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె పోస్ట్ లు తన భర్తని ఉద్దేశించే అని నెటిజన్లు భావిస్తున్నారు.
ఈ క్రమంలో లేటెస్ట్ గా ఆమె పెట్టిన పోస్టులు పెద్ద రచ్చ అవుతున్నాయి. కర్మనే అన్ని సెట్ చేస్తుందని, కాలమే అన్నింటికి సమాధానం చెబుతుందని ఆమె తెలిపింది.
కర్మ అన్ని సరిదిద్దుతుందిః శ్యామిలీ పోస్ట్ వైరల్
`కాలం బహిర్గతం చేస్తుంది. కర్మ సరిదిద్దుతుంది. విశ్వం వినయం కలిగిస్తుంది` అని తన పోస్ట్ లో పేర్కొంది శ్యామలీ. ఇది సమంతని, తన భర్తని ఉద్దేశించే అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
ఈ పోస్ట్ మరవకముందే లేటెస్ట్ గా మరో పోస్ట్ పెట్టింది శ్యామలీ. ఇందులో `ఆత్మ మేల్కొన్నప్పుడు ప్రతిదీ అర్థమవుతుంది` అని పేర్కొంది. ఇదిప్పుడు నెట్టింట రచ్చ చేస్తుంది. శ్యామలీ పోస్ట్ లపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
`అవును కర్మ నిజమే, ఆమె మౌనంగా కర్మ పనిచేయడం కోసం వేచి చూస్తుంది` అని కామెంట్ పెడుతున్నారు. మరికొందరు నెటిజన్లు కూడా శ్యామలీకి సపోర్ట్ గా పోస్ట్ లు పెడుతుండటం విశేషం.
శ్యామలీ పోస్ట్ కి స్పందించని సమంత, రాజ్ నిడిమోరు
వీటిపై అటు సమంతగానీ, ఇటు రాజ్ నిడిమోరు గానీ స్పందించడం లేదు. దీంతో ఈ సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి వీటికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో, ఈ రూమర్లకి ఎప్పుడు ముగింపు పలుకుతారో చూడాలి. ఇక సమంత ఇటీవల `శుభం` అనే చిత్రాన్ని నిర్మించింది. దీనికి మంచి స్పందన లభించింది.
ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేసే కంటెంట్తో వస్తానని, అందుకోసం నిరంతరం కష్టపడతానని పేర్కొంది సమంత. ఇక సమంత `మా ఇంటి బంగారం` చిత్రంలో నటించాల్సి ఉంది. హిందీలో ఓ సినిమా చేస్తుంది. వీటికి సంబంధించిన అప్ డేట్లు రావాల్సి ఉంది.
మూడేళ్ల క్రితమే భార్య శ్యామలీతో విడిపోయిన రాజ్ నిడిమోరు
దర్శకుడు రాజ్ నిడిమోరు `ది ఫ్యామిలీ మ్యాన్` రెండు సిరీస్లను, `ఫర్జీ`, `సిటాడెల్` వెబ్ సిరీస్లను రూపొందించి పాపులర్ అయిన విషయం తెలిసిందే.
రాజ్ నిడిమోరు, శ్యామలీ 2015లో మ్యారేజ్ చేసుకున్నారు. 2022లో విడిపోయినట్టు సమాచారం. మరి దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. నిజంగానే విడిపోతే ఇలా ఎందుకు పోస్ట్ లు పెడుతుందనేది సస్పెన్స్ గా మారింది.