విసుక్కుంటూ మహేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతే.. వసుధార కూడా.. శైలేంద్రను తిడుతుంది. నువ్వు అసలు మనిషివేనా..? నువ్వు మారవా అనేసి వసు కూడా వెళ్లిపోతుంది.
మరి కొందరికి తండ్రి ఉంటే తల్లి ఉండదు... తల్లి ఉంటే తండ్రి ఉండడు. కొందరికైతే అసలుు వాళ్ల తండ్రి ఎవరో కూడా తేలీదు అని అంటాడు. కావాలనే మను ని టార్గెట్ చేయాలని ఇలా మాట్లాడతాడు.
ఇక.. శైలేంద్ర రెచ్చిపోతాడు. ఈ కారణం చూపించి ఆ మనుగాడికి చుక్కలు చూపిస్తానని.. వాడి ఎమోషన్స్ తో ఆడుకుంటాను అని సంబరపడిపోతాడు.
మనుకి ఇష్టమైన కూరలు ఏంటి అని ఏంజెల్ అడుగుతుంది. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఏదో చెప్పాడు అని వసుధార, మను అంటే... అనుపమ మనుకి ఇష్టమైన వంటలన్నీ చెప్పేస్తుంది.
వాళ్లు నిన్ను ప్రశ్నించడంలో తప్పు లేదు కదా అని ఆవిడ అంటే.... నాకు నచ్చినట్లు నేను బతుకుతున్నాను అని.. వాళ్లు ఎందుకు అడగాలి అని అనుపమ అంటుంది.
అసలు అనుపమ నిన్ను అమ్మ అని ఎందుకు పిలవొద్దు అన్నదో చెప్పమని మహేంద్ర మరీ మరీ అడగడంతో.. మను చెప్పడం మొదలుపెడతాడు.
మీ మాటలు నాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి అని అనుపమ చెబుతున్నా.. దేవయాణి ఆపదు. నీ భర్త పేరు అందరికీ చెప్పడం ఇష్టం లేకపోతే.. నాకు మాత్రమే చెప్పు.. లేదంటే చిన్న క్లూ ఇవ్వు అని అడుగుతూ ఉంటుంది.
ఆ విషయం నిజంగా నాకు తెలీదు అని రాజీవ్ చాలా అమమాయకంగా నటిస్తాడు. అయితే.. శైలేంద్ర కూడా.. అనుపమగారిపై ఎటాక్ జరిగిన తర్వాతే.. ఆవిడ మీ అమ్మ అని తెలిసిందని చెబుతాడు.
ఇక ఆమెకు ఒక కొడుకు ఉన్నాడని మీ అందరికీ తెలిసాకే తెలిసింది. అంటే మా అత్తయ్య ఒక చట్రంలో బతికేస్తుంది. కాబట్టి.. మీరు ఎంత అడిగినా నిజం చెప్పదు అని ఏంజెల్ అంటుంది.
ఆ మాటకు మను మనసు ముక్కలు అవుతుంది. బాధగా వెళ్లిపోతాడు. వసుధార చూసి పిలుస్తుంది. కానీ.. మను పలకుండా వెళ్లిపోతాడు. తల్లీ కొడుకులను దగ్గర చేయాలని వసు వేసిన ప్లాన్ రివర్స్ అయ్యింది.