వైకుంఠ ఏకాదశి సందర్భంగా 2022, జనవరి 13వ తేదీ నుంచి 10 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా టీటీడీ అదనపు ఇవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది వైకుంఠ ద్వారా దర్శనం పది రోజుల పాటు తెరిచి ఉంచాలని నిర్ణయించినట్టు ధర్మారెడ్డి తెలిపారు