బద్వేల్ ఉప ఎన్నిక పలితం ఇవాళ(బుధవారం) వెలువడనుంది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. బద్వేలు నియోజకవర్గం 7 మండలాల్లోని 281 కేంద్రాల్లో అక్టోబరు 30న పోలింగ్ జరగ్గా.. 68.37 శాతం ఓటింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ తెలిపారు. మెుత్తం 15 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ప్రధానంగా వైకాపా, బిజెపి, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. అయితే ఇప్పటికు ఈ ఎన్నికకు సంబంధించి ఫలితాలు ఎలా ఉండవచ్చనే దానిపై పలువురు రాజకీయ విశ్లేషకులు, సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమేనని అంతా భావిస్తున్నారు. ఏం జరుగుతుందో నేడు తేలనుంది.