బంగారు తెలంగాణగా కాదు.. బారుల తెలంగాణ, బీరుల తెలంగాణగా మార్చారు: కేసీఆర్పై షర్మిల విమర్శలు
టీఆర్ఎస్ (trs) నేతలపై మండిపడ్డారు వైఎస్సార్టీపీ (ysrtp) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (ys sharmila). విశ్వ విద్యాలయాల భూములపై టీఆర్ఎస్ నేతల కన్ను పడిందంటూ ఆమె ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళవారం ఆమె నిరాహారదీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే
టీఆర్ఎస్ (trs) నేతలపై మండిపడ్డారు వైఎస్సార్టీపీ (ysrtp) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (ys sharmila). విశ్వ విద్యాలయాల భూములపై టీఆర్ఎస్ నేతల కన్ను పడిందంటూ ఆమె ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళవారం ఆమె నిరాహారదీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు ఆమె నల్గొండ పట్టణంలో దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ... బంగారు తెలంగాణ తీసుకువస్తామని చెప్పిన కేసీఆర్ (kcr) ఇప్పుడు బారుల తెలంగాణ, బీరుల తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చారని ఆమె విమర్శించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో (osmania university) 33 శాతం పోస్టుల ఖాళీలు ఉన్నాయని షర్మిల వెల్లడించారు. రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీలో చూసినా 63 శాతం ఖాళీలు ఉన్నాయని ఆమె చెప్పారు. అసలు విద్యార్థుల భవిష్యత్ను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవట్లేదని షర్మిల మండిపడ్డారు. విద్యార్థులు బాగా చదువుకుంటే వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయడం లేదా? అంటూ ఆమె దుయ్యబట్టారు. 12 శాతం రిజర్వేషన్లు (Reservations) ఇస్తామని చెప్పి ముస్లింలను కూడా కేసీఆర్ మోసం చేశారని షర్మిల ఆరోపించారు.
కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వరుస ట్వీట్లతో షర్మిల విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలోనూ farmer సమస్యల మీద ఇలాగే దుమ్మెత్తిపోశారు. రైతులను ఆదుకోకుండా వారిని కన్నీటిలో ముంచుతున్నారని ఆమె ఆరోపించారు. 'రైతులకు పెట్టుబడి రాకపోతే, పండిన పంట వరద పాలైతే, ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తే, రైతు చావక ఇంకేం చేస్తాడు దొరా?' అని షర్మిల ప్రశ్నించారు.
ALso Read:దొర మాటిచ్చి నాలుగేండ్లైనా బీసీ సబ్ ప్లాన్ పత్తాలేదు.. కేసీఆర్ పై షర్మిల ఫైర్..
'కేసీఆర్ ఒక్క రైతు బంధు ఇచ్చిండు. ఫసల్ బీమా బంద్ పెట్టిండు. పంటలకు బీమా లేదు, రైతుకు ధీమా లేదు, పంటలు వాన పాలు. కష్టం నీటి పాలు. రైతును కన్నీటిలో ముంచిండు' అని షర్మిల చెప్పారు. 'తాను పెద్ద రైతును అని చెప్పుకొనే దొరగారికి రైతు ఆత్మహత్యలు ఎందుకు చేసుకొంటున్నారో తెలియదట .. అందుకే కమిటీ వేసిండు. కోర్టులు మొట్టి కాయలు వేయనిదే మీకు ఏ పని చేయాలనే సోయి రాదు కానీ.. కనీసం ఇప్పటికైనా పంటల బీమాను అమలు చేసి రైతులను ఆదుకోండి' అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
తాజాగా నిన్న షర్మిల ట్విట్టర్ ద్వారా కేసీఆర్పై మండిపడ్డారు. ‘దొర మాటిచ్చి నాలుగేండ్లయినా పత్తాలేని బీసీ పాలసీ అమలు, బీసీలంటే దొరగారి మీటింగ్లకు మందిని తెచ్చేవారు, గొర్లు, బర్లు కాసుకునేవారు, ఆత్మగౌరవ భవనాలకు అమ్ముడుపోయేవారు. అంతే తప్ప.. అధికారంలో పాలుపంచుకునేవారు, చట్టాలు చేసేందుకు అర్హులు కారు అభివృద్ధికి నోచుకునేవారు కాదు’ అన్నారు. అంతేకాదు.. ‘అందుకే, కేసీఆర్ దొర 2017లో మీటింగ్ పెట్టి మూడు రోజులు ముచ్చట చేసిన 210 తీర్మానాలు మూలకు పెట్టిండు, BC sub-plan బీసీ సబ్ ప్లాన్ లేదు, ఇండస్ట్రీయల్ పాలసీ లేదు, నిధులు లేవు, ఫీజు రియింబర్స్మెంట్ లేదు.. 210 తీర్మానాలను గంగలో కలిపాడు కేసీఆరు. ఇది దొరగానికి 54 శాతం ఉన్న బీసీల మీద ఉన్న ప్రేమ’ అంటూ మండిపడ్డారు.