Asianet News TeluguAsianet News Telugu

జగన్, కేసీఆర్‌లకు ఎన్టీఆర్ ఆశీస్సులుంటాయి: లక్ష్మీపార్వతి

:తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయని వైసీపీ నేత, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి చెప్పారు. 

ysrcp leader laxmi parvathi interesting comments on telugu states chief ministers
Author
Hyderabad, First Published May 28, 2020, 10:41 AM IST

హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయని వైసీపీ నేత, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి చెప్పారు. 

ఎన్టీఆర్ 97 వ జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ ఘాట్ లో  గురువారం నాడు ఆమె ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.  ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించే వారికి ఆయన ఆశీస్సులు ఉంటాయన్నారు. అదృష్టం కొద్దీ తెలుగు రాష్ట్రాలకు మంచి ముఖ్యమంత్రులు దొరికారన్నారు.
 
ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ప్రస్తుత  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారని లక్ష్మీ పార్వతి చెప్పారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని ఆమె తెలిపారు.  తెలుగు వారి కష్టాలను తీర్చటానికి ఇద్దరు ముఖ్యమంత్రులు  కష్టపడుతున్నారని లక్ష్మీ పార్వతి చెప్పారు.

also read:కేసీఆర్ తో చిరంజీవి పెద్దల చర్చలు: బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో లక్ష్మీపార్వతి వైసీపీ తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్మీపార్వతికి తెలుగు అకాడమీ చైర్మెన్ పదవిని జగన్ కట్టబెట్టారు.

ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి నివాళులర్పిస్తారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడ ఎన్టీఆర్ సమాధి నివాళులర్పిస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios