టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న యూత్
పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యే
రంగారెడ్డి జిల్లాలో టిఆర్ఎస్ లో చేరికలు జోరందుకున్నాయి. ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మండలాధ్యక్షులు యంపల్ల నిరంజన్ రెడ్డి సమక్షంలో కర్ణంగూడ గ్రామస్తులు టిఆర్ఎస్ పార్టీ లో చేరారు.
కర్ణంగూడ గ్రామానికి చెందిన వంగేటి తిర్మల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి , మెుహన్ రెడ్డి, గోవర్థన్ రెడ్డి , మహిపాల్ రెడ్డి, శ్రీ నాథ్ రెడ్డి శ్రీ కాంత్ రెడ్డి తదితరులని టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిటిసి లక్ష్మయ్య , అంజిరెడ్డి, సత్యనారాయణ గ్రామశాఖ అధ్యక్షులు శివశంకర్ ఇందులో పాల్గొనడం జరిగింది.