Asianet News TeluguAsianet News Telugu

స్నేహితుల మధ్య చిచ్చుపెట్టిన బిర్యానీ... యువకుడు మృతి

అందరూ బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత బిర్యానీకి బిల్లు చెల్లించే విషయమై వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అభిలాష్ అనే యువకుడిపై మిగిలిన స్నేహితులు దాడి చేశారు.

youth beaten to death their friend in a clash over biryani bill payment
Author
Hyderabad, First Published Dec 31, 2019, 9:24 AM IST

బిర్యానీ స్నేహితుల మధ్య చిచ్చు రేపింది. అప్పటి వరకు కలిసి మెలిసి ఆనందంగా ఉన్న ఫ్రెండ్స్... ఒక్కసారిగా కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఓ స్నేహితుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నవంబర్ 25న కొందరు యువకులు మద్యం సేవించారు. ఆ తర్వాత ఓ హోటల్‌ కి వెళ్లారు. అక్కడ బిర్యానీ ఆర్డర్ చేశారు. అందరూ బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత బిర్యానీకి బిల్లు చెల్లించే విషయమై వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అభిలాష్ అనే యువకుడిపై మిగిలిన స్నేహితులు దాడి చేశారు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అభిలాష్‌ను పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ రోజు నుంచి చికిత్స పొందుతున్న అభిలాష్.. సోమవారం(డిసెంబర్ 30,2019) మృతిచెందాడు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాగా...అభిలాష్ మృతి పట్ల అతని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు గల కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios