అమ్మ లాంటి ఆయా.. మైనర్ బాలుడిని లైంగికంగా వేధించి..!
కాలిన గాయాల గురించి తల్లిదండ్రులు అడిగినా ఆ బాలుడు చెప్పలేదు. ఆ తర్వాత పది రోజులకు మరోమారు ఆ బాలుడిని టాయ్లెట్కు తీసుకెళ్లి, అసభ్యంగా ప్రవర్తించింది.
అమ్మ లాంటి ఆయా వృత్తిలో ఉన్న ఓ మహిళ.. మైనర్ బాలుడి పట్ల దారుణంగా ప్రవర్తించింది. బాలుడిని లైంగికంగా వేధించింది. బాలుడి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ మహిళకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. కొత్తపేట బాలాపూర్కు చెందిన కె.మల్లేశ్ భార్య కె.జ్యోతి(27) 2017 నవంబరు 10న బార్క్సలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఆయాగా పనికి కుదిరింది.
చేరిన పది రోజుల్లోనే.. ఆ స్కూల్లో చదువుతున్న తొమ్మిదేళ్ల ఓ బాలుడిని టాయ్లెట్కు తీసుకువెళ్లింది. ఆ బాలుడి మర్మావయవాలను పట్టుకుని, అసభ్యంగా ప్రవర్తించింది. దీంతో ఆ బాలుడు తల్లిదండ్రులకు చెబుతానంటూ ఏడవడంతో సిగరెట్ లైటర్తో అతని చేతి వేళ్లను కాల్చి బెదిరించింది. కాలిన గాయాల గురించి తల్లిదండ్రులు అడిగినా ఆ బాలుడు చెప్పలేదు. ఆ తర్వాత పది రోజులకు మరోమారు ఆ బాలుడిని టాయ్లెట్కు తీసుకెళ్లి, అసభ్యంగా ప్రవర్తించింది.
ఆ తర్వాత బాలుడి మానసిక స్థితిలో మార్పులు రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు నిలదీయడంతో ఆయా తీరును వివరించాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. జ్యోతిని అరెస్టు చేశారు. నిందితురాలికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10వేల జరిమానా విధించింది.