Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడితో అక్రమ సంబంధం.. అడ్డుగా ఉన్నారని కన్న బిడ్డలనే..

సూర్యపేటకు చెందిన నాగమణి అనే మహిళకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెకు  ఇటీవల ఆటోడ్రైవర్ మధుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. 

woman kills his own children over illicit relationship in suryapeta
Author
Hyderabad, First Published Jun 22, 2020, 11:22 AM IST

ఆమెకు అప్పటకే పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.కానీ.. కొన్ని కారాణాల వల్ల భర్తకు దూరమైంది. పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది. ఆమె ఒంటరి తనాన్ని ఆసరాగా తీసుకోని ఓ ఆటో డ్రైవర్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ బంధానికి తన కన్న బిడ్డలు ఇద్దరూ ఆమెకు అడ్డుగా అనిపించారు.

 అంతే.. వారిని తన కడుపున పుట్టిన బిడ్డలే అన్న కనికరం కూడా లేకుండా అతి దారుణంగా హత్య చేసింది. ఈ సంఘటన సూర్యాపేటలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సూర్యపేటకు చెందిన నాగమణి అనే మహిళకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెకు  ఇటీవల ఆటోడ్రైవర్ మధుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. 

నాగమణికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వీరు తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారనే కారణంగా వారిని అడ్డు తొలగించాలని నాగమణిపై మధు ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో ఆ ఇద్దరు పిల్లలను నాగమణి సూర్యాపేట మినీ ట్యాంక్ బండ్‌ చెరువులో ముంచి హత్య చేసింది. ఈ కేసులో నిందితులిద్దరు మధు, నాగమణిలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios