కొమురం భీం జిల్లాలో మరోసారి పులి పంజా విసిరింది. ఆదివారం పులి దాడిలో ఓ యువతి మృతి చెందింది. పెంచికల పేట మండలం కొండపల్లిలో ఈ ఘటన జరిగింది

కొమురం భీం జిల్లాలో మరోసారి పులి పంజా విసిరింది. ఆదివారం పులి దాడిలో ఓ యువతి మృతి చెందింది. పెంచికల పేట మండలం కొండపల్లిలో ఈ ఘటన జరిగింది. పత్తి చేనులో పని చేస్తున్న నిర్మల అనే యువతిపై పులి దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

మరోవైపు పులి సంచారంతో కొండపల్లి వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, ఈ నెల 11న దహేగాం మండలం దిగిడలో యువకుడిని పులి చంపిన సంగతి తెలిసిందే.