Asianet News TeluguAsianet News Telugu

పెళ్లయిన వ్యక్తిని ప్రేమించాలంటూ ‘యువతి’ వేధింపులు.. చివరికి అతను చేసిన పని...

కరీంనగర్ జిల్లా, జగిత్యాలలో తనను ప్రేమించాలని ఓ యువతి వేధింపులకు గురిచేస్తుండడంతో పెళ్లైన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెడితే.. మల్యా మండలంలోని లంబాడిపల్లికి చెందిన వేముల గణేష్ ట్యాక్సీ డ్రైవర్. ట్యాక్సీ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. 

woman harassing married man to love, attempted suicide in karimnagar
Author
Hyderabad, First Published Aug 26, 2021, 10:15 AM IST

జగిత్యాల : వివాహితుడితో పరిచయం పెంచుకున్న ఓ యువతి ప్రేమించమంటూ వేధింపులకు పాల్పడింది. దీంతో ఎటూ పాలుపోక ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓ వైపు అమ్మాయిలపై దారుణాలు జరుగుతుంటే.. మరోవైపు ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. 

కరీంనగర్ జిల్లా, జగిత్యాలలో తనను ప్రేమించాలని ఓ యువతి వేధింపులకు గురిచేస్తుండడంతో పెళ్లైన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెడితే.. మల్యా మండలంలోని లంబాడిపల్లికి చెందిన వేముల గణేష్ ట్యాక్సీ డ్రైవర్. ట్యాక్సీ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి గోదావరి అనే యువతితో పెళ్లి అయ్యింది. ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.

కాగా, ఇదే మండలం తాటిపల్లికి చెందిన ఓ యువతి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమె తరచుగా గణేష్ ట్యాక్సీలోనే స్వగ్రామానికి వెళ్లేది. అలా వారిద్దరి మధ్య పరిచయం, స్నేహంగా మారింది. కొద్దికాలం తరువాత ఆ యువతి గణేష్ ను ప్రేమ పేరుతో వేధిండం మొదలుపెట్టింది. 

దీనికి అతను నిరాకరించాడు. దీంతో రెండు రోజులు వేరే వ్యక్తులతో ఫోన్ చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతోంది. గణేష్ కు ఏం చేయాలో పాల్పొలేదు. వేదింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురై బుధవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి, జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం గణేశ్ చికిత్స పొందుతున్నాడు. ఆ యువతి నుంచి తనను ఎలాగైనా కాపాడాలని వేడుకుంటున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios