Asianet News TeluguAsianet News Telugu

కామారెడ్డి జిల్లాలో దారుణం... పశువుల కాపరిపై సామూహిక అత్యాచారం, అపస్మారక స్థితిలో మహిళ

నిరుపేద మహిళ పొట్టకూటికోసం పశువుల కాపరిగా మారింది. ఒంటరిగా అటవీ ప్రాంతానికి వెళ్లే మహిళపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడిన దారుణం కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

Woman gang raped by two villagers in kamareddy
Author
Kamareddy, First Published Jun 26, 2022, 7:41 AM IST

కామారెడ్డి : ఇంటా బయటా ఆడబిడ్డలకు రక్షణ లేకుండాపోయింది. తెలంగాణలో జూబ్లీహిల్స్ పబ్ ఘటన తర్వాత మహిళలపై రోజులో అఘాయిత్యం ఘటన వెలుగుచూస్తోంది. మహానగరం హైదరాబాద్ లోనే కాదు మారుమూల కూగ్రామాల్లో కూడా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన నిరుపేద మహిళ అటవీ ప్రాంతానికి వెళ్లగా ఇద్దరు నీచులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నిరుపేద మహిళ పశువులు మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్ళింది. ఇలా నిత్యం ఒంటరిగా అటవీప్రాంతానికి వెళ్లే మహిళపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు కామాంధులు కన్నేసారు. ఎలాగయినా ఆమెను అనుభవించాలని నీచపు అలోచనతో వున్న ఇద్దరు అదునుకోసం ఎదురుచూసి గత గురువారం దారుణానికి ఒడిగట్టారు. అయితే మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఏం జరిగిందో తెలియక ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

ప్రతిరోజులాగే గత గురువారం కూడా మహిళ పశువులు మేపడానికి గ్రామ శివారులోని అటవీప్రాంతానికి వెళ్లింది. ఇలా నిర్మానుష్య ప్రాంతంలో ఒంటరిగా కనిపించిన ఆమెపై అదే గ్రామానికి చెందిన బస్సి రాజేందర్, బస్సి రెడ్యాలు బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దుర్మార్గుల బారినుండి తప్పించుకోడానికి మహిళ ప్రయత్నించినా వాగు సమీపానికి ఎత్తుకెళ్లి ఇద్దరు దుర్మార్గులు అతి దారుణంగా  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

అత్యంత పాశవికంగా లైంగికదాడికి గురయిన మహిళ అపస్మరక స్థితిలోకి వెళ్ళిపోయింది. దీంతో ఇద్దరు దుండగులు ఆమెను అక్కడే వదిలి పరారయ్యారు. గ్రామానికి చెందిన కొందరు వాగు  ఒడ్డున పడివున్న మహిళను గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో వారు అక్కడికి చేరకుని మహిళను దగ్గర్లోని హాస్పిటల్ కకు తరలించారు. చికిత్స తర్వాత స్పృహలోకి వచ్చిన మహిళ తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబసభ్యులకు తెలిపింది.   

తమ ఇంటి ఆడబిడ్డపై జరిగిన అఘాయిత్యం గురించి తెలిసి ఆవేశంతో రగిలిపోయిన బాధిత కుటుంబం దుండగులను పట్టుకునేందుకు వాళ్ల ఇళ్లకు వెళ్లారు. అప్పటికే ఇద్దరు నీచులు ఇళ్లువిడిచి పరారయ్యారు. దీంతో బాధిత కుటుంబం నేరుగా గాంధారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమ బిడ్డపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇక హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఓ యువకుడు సొంత పెదనాన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన వెలుగుచూసింది. 17 ఏళ్ల బాలిక నగరంలోనే ఉండే పెదనాన్న ఇంటికి తరచూ వెళుతూ ఉండేది. ఈ క్రమంలో ఆ బాలిక పెదనాన్న కుమారుడి కన్నుపడింది. చిన్నపిల్ల అని కూడా చూడకుండా గత జనవరి నెలలో ఆ బాలికపై సోదరుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన అతడి స్నేహితుడు కూడా బాలికను భయపెట్టి అత్యాచారం చేశాడు.ఇలా పలుమార్లు ఇద్దరు నీచులు ఆ చిన్నారి మీద దారుణానికి ఒడిగట్టారు. 

అయితే ఇటీవల బాలిక ఆరోగ్యం కాస్త నలతగా ఉండటంతో… ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆరు నెలల గర్భవతి అని తెలిసింది. దీంతో తల్లిదండ్రులు ప్రశ్నించగా బాలిక జరిగిన విషయం చెప్పింది.  పెదనాన్న కుమారుడు, అతని స్నేహితుడు పలుమార్లు  అత్యాచారం చేశారని తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios