హాస్పిటల్ లిఫ్ట్ ప్రమాదంలో మహిళ మృతి.. లిఫ్ట్ రాకముందే తెరుచుకున్న డోర్.. ఫోన్ మాట్లాడుతూ అడుగేయడంతో..!
ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్లో ఓ మహిళ దుర్మరణం చెందారు. లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ కావడంతో ఆమె ముందు చూసుకోకుండా అడుగేశారు. దీంతో ఆమె ఆ లిఫ్ట్ గుంతో పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆమెకు చికిత్స అందించారు. పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు వదిలారు.
హైదరాబాద్: ఖమ్మ ప్రభుత్వ హాస్పిటల్లో విషాదం చోటుచేసుకుంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తమ బంధువులను పరామర్శించి తిరిగి వెళ్లుతున్న ఓ మహిళ లిఫ్ట్ ప్రమాదంలో మరణించింది. లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ కావడంతో.. ఫోన్ మాట్లాడుతున్న ఆమె ముందు చూసుకోకుండా అడుగేసింది. దీంతో ఆమె ఆ లిఫ్ట్ గుంతలో పడిపోయింది. తీవ్ర గాయాలపాలైన ఆమెకు హాస్పిటల్లో చికిత్స అందించారు. కానీ, ఆమె ప్రాణాలు దక్కలేదు.
వైరా మండలం గొల్లెన పహాడ్కు చెందిన ప్రమీల.. ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చారు. ఆ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తమ బంధువును పరామర్శించడానికి వచ్చింది. పరామర్శించి తిరిగి వెళ్లడానికి బయల్దేరింది. లిఫ్ట్ కోసం ఎదురుచూసింది. లిఫ్ట్ కోసం బటన్ క్లిక్ చేసి ఎదురుచూస్తూ నిలబడింది. ఇంతలో ఆమెకు ఓ ఫోన్ వచ్చింది. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడటం మొదలుపెట్టింది. లిఫ్ట్ రాక ముందే డోర్ ఓపెన్ చేసింది. ఫస్ట్ టైం ఆ డోర్ రాలేదు. కానీ, మరోసారి డోర్ ఓపెన్ చేయగానే.. అది తెరుచుకుంది. లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ కావడంతో.. ఆమె లిఫ్ట్ వచ్చిందని భావిస్తూ ముందుకు అడుగు వేసింది. కానీ, అక్కడ లిఫ్ట్ లేకపోవడంతో కిందకు వెళ్లిపోయి పడింది.
లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ కాకపోవడాన్ని ఆమె కుటుంబ సభ్యులు లేవనెత్తారు. ఇది పూర్తిగా మెయింటెనెన్స్ లోపమే అని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కేసు ఇంకా కేసు నమోదు కాలేదు. అయితే, పోలీసులు మాత్రం ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.
ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది.