Asianet News TeluguAsianet News Telugu

ప్రైవేటు బస్సు ఢీకొని మహిళ మృతి

స్కూటీ మీద వెళ్తున్న యువతిని ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. యువతి సైదాబాద్ కి చెందిన కావ్యగా పోలీసులు గుర్తించారు.  సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

woman died in accident at nalgonda crossroads
Author
Hyderabad, First Published Nov 2, 2019, 10:37 AM IST

ప్రైవేటు బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందిన సంఘటన హైదారబాద్ నగరంలో చోటుచేసుకుంది. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధి నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

స్కూటీ మీద వెళ్తున్న యువతిని ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. యువతి సైదాబాద్ కి చెందిన కావ్యగా పోలీసులు గుర్తించారు.  సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం  బస్సును , డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. 

యువతి  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం  ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. మహిళకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె వివరాలు తెలుసుకొని... కుటుంబసభ్యులకు సమాచారం అందిస్తామని పోలీసులు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios