Asianet News TeluguAsianet News Telugu

నాగర్‌కర్నూల్‌లో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య.. అస్థిపంజరమై లభించిన బాడీ

నాగర్‌కర్నూల్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన చోటుచేసుకుంది. భర్త మృతదేహాన్ని గుట్టుగా సమీపంలోని నల్లమల్ల అడవిలో పారేశారు. తాజాగా, ఆ బాడీ అస్థిపంజరం రూపంలో పోలీసులకు లభించింది. 

wife killed husband along with the help of lover, police recovered  body
Author
Hyderabad, First Published Aug 28, 2021, 4:55 PM IST

హైదరాబాద్: నాగర్‌కర్నూల్ దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి ఓ సతీమణి భర్తను హతమార్చారు. విషయం మూడో మనిషికి తెలియకుండా మృతదేహాన్ని గుట్టుగా నల్లమల అడవిలో పారేశారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో ఘటన చోటుచేసుకుంది. నల్లమల అడవిలోని దర్గా దగ్గర మృతదేహం లభించింది.

తాజాగా పోలీసులు ఆ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం అస్థిపంజరంగా మారిపోయింది. ఆ అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కేషగూడెం గ్రామానికి చెందిన మాణిక్యరావుగా గుర్తించారు.

Follow Us:
Download App:
  • android
  • ios