తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పొడిగానే వుంది. కొన్ని ప్రాంతాల్లో చలి ప్రభావం అంతగా లేదు. కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం చలి వణికిస్తోంది. ముఖ్యంగా మన్యం జిల్లాలోని చింతపల్లి, లంబసింగి, పాడేరు, అరకులోయలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

నిన్న మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాలను వణికించిన చలి పులి ఎందుకో సైలెంట్ అయ్యింది. కొద్దిరోజులుగా రెండు రాష్ట్రాల్లోనూ సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. రాత్రి వేళలో చలి కాస్త పెరుగుతుండగా.. ఉదయం వేళలో మాత్రం దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. వచ్చే మూడు రోజుల పాటు వాతావరణం ఇలాగే వుంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం చలి తీవ్రత మాత్రం అలాగే వుంది.చింతపల్లి, లంబసింగి, పాడేరు, అరకులోయలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఇటు హైదరాబాద్‌లోనూ పొడి వాతారణం వుంటుందని ఐఎండీ తెలిపింది. ఉదయం సమయంలో మాత్రమే నగరంలో పొగమంచు కమ్ముకుంటోంది. హైదరాబాద్‌లో శనివారం 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఉత్తర భారతదేశంలో మాత్రం చలిగాలులు పెరిగాయి. హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హిమాచల్‌‌లో విపరీతంగా మంచు కురుస్తూ వుండటంతో పర్యాటకులు పోటెత్తుతున్నారు. 

Also REad: ఉత్త‌ర‌భార‌తంలో పెరుగుతున్న చ‌లి.. కాశ్మీర్ లో మైన‌స్ డిగ్రీల‌కు ప‌డిపోయిన ఉష్ణోగ్ర‌తలు..

ఇకపోతే.. కాశ్మీర్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయి కంటే చాలా డిగ్రీలు తగ్గడంతో చలి పరిస్థితులు మ‌రింత‌గా పెరిగాయి. చాలా చోట్ల ఈ సీజన్‌లో అత్యంత శీతలమైన రాత్రిని అనుభవించినట్లు అధికారులు గత ఆదివారం తెలిపారు. ఈ సంవత్సరం లోయలో పొడి కానీ చల్లగా ఉండే క్రిస్మస్ ఉందని వాతావరణ కార్యాలయం తెలిపింది. వ‌చ్చే వారం మ‌రింత‌గా ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయే అవ‌కాశ‌ముంద‌ని పేర్కొంది. గత వారం తీవ్రమైన చలి కారణంగా అనేక ప్రాంతాల్లో నీటి సరఫరా లైన్లు గడ్డకట్టడంతో పాటు దాల్ సరస్సు లోపలి భాగం గడ్డకట్టినట్లు పేర్కొన్నారు. 

గత వారం అమర్‌నాథ్ యాత్రకు బేస్ క్యాంప్‌లలో ఒకటిగా పనిచేసే పహల్గామ్‌లో మైనస్ 6.4 డిగ్రీల సెల్సియస్ నుండి తక్కువ మైనస్ 7 డిగ్రీల సెల్సియస్ నమోదైందని అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రిసార్ట్‌లో ఇదే కనిష్ట ఉష్ణోగ్రత అని తెలిపారు. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ప్రసిద్ధ స్కీ-రిసార్ట్ గుల్మార్గ్‌లో మైనస్ 5.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సరిహద్దు కుప్వారా జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత సీజన్‌లో అత్యల్పంగా మైనస్ 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అలాగే, లోయకు గేట్‌వే పట్టణమైన ఖాజీగుండ్ కూడా సీజన్‌లో అత్యల్పంగా మైనస్ 5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని అధికారులు తెలిపారు